Tarun Chugh: తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తాది..!
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ అన్నారు. నిన్న ( మంగళవారం ) ప్రకటించిన 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా చూస్తే అర్థమవుతోంది అని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఈ సారి పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని అంతా అనుకున్నారు. తీరా అభ్యర్థులను చూస్తే 7 చోట్ల మినహా దాదాపు అందరు ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇచ్చారు.. కేసీఆర్, ఆయన పార్టీ సిగ్గు తప్పిన విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని తరుణ్ చుగ్ అన్నారు.
Read Also: Kalki 2898AD: ఇది కదా మనకు కావాల్సిన ఎమోషన్.. చిరును ఇమిటేడ్ చేసిన ప్రభాస్
Also Read
- NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
- Prabhas - Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
- SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
- Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
ఈసారి కనీసం 20 మంది కొత్త అభ్యర్థులు ఉంటారన్నారు కేసీఆర్ చెప్పారు.. కానీ, అలా జరగలేదు అని తరుణ్ చుగ్ తెలిపారు. నిన్న కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా పాత సీసాలో పాత సారానే పోసినట్లుందని అన్నారు. పాచిపోయిన కూరను మళ్లీ వేడి చేసి ప్రజలకు అందించే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పారు. పతాక స్థాయికి చేరిన కేసీఆర్, ఆయన ప్రభుత్వ అవినీతిపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు అని తరుణ్ చుగ్ తెలిపారు. కేసీఆర్ స్వయంగా పెద్ద అవినీతిపరుడు.. అవినీతిలో ఆవిష్కరిస్తున్న కొత్త విధానాలకు ఆస్కార్ అవార్డు ఇచ్చేదుంటే కేసీఆర్ ఈ అవార్డుకు అన్నివిధాల అర్హుడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చుగ్ పేర్కొన్నాడు.
Read Also: Onions: 4 నెలలు ఉల్లి తినకుంటే పోయేదేం లేదు.. మంత్రి హాట్ కామెంట్స్
ఈ జాబితా కేసీఆర్ అవకాశవాదానికి మరో నిదర్శనం.. ఇటీవల మునుగోడు ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలతో దోస్తీ కట్టి.. ఇప్పుడు వారిని వదిలేశాడు అని తరుణ్ చుగ్ అన్నారు. ఇదీ కేసీఆర్ నైజం. తన స్వలాభం కోసం ప్రజలను వాడుకుని, పని పూర్తయ్యాక వదిలేస్తాడు.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన ఇదే చేశారు.. విద్యార్థులను, ఉద్యోగులను, నిరుద్యోగులను ఉద్యమానికి ఉపయోగించుకుని, రాష్ట్రం ఏర్పడ్డాక వారికి ద్రోహం చేశారు అని ఆయన అన్నారు. కేసీఆర్ అవకాశవాదం, ద్వంద్వ వైఖరి, వాడుకొని వదిలేసే విధానం గురించి తెలుసుకున్న ప్రజలు తమ ఓటుతో బీఆర్ఎస్ను బంగాళాఖాతంలోకి కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చుగ్ చెప్పుకొచ్చాడు.
Read Also: Kushi : సెన్సార్ పూర్తి చేసుకున్న లవ్ అండ్ రొమాంటిక్ మూవీ..
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని తరుణ్ చుగ్ తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తెలంగాణ ప్రజలు తమ ఆకాంక్షలు సాకారం చేసుకునేందుకు, కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తో తమ ఆకాంక్షలు నెరవేరుతాయని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.. ఇక్కడి ప్రజలకు బీజేపీ అన్నివిధాలా అండగా ఉంటుంది అని తరుణ్ చుగ్ అన్నారు.
- Tags
- bjp
- BRS
- cm kcr
- tarun chugh
- telangana
తాజావార్తలు
-
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
-
NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!