ఆచరణ సాధ్యం కాని మార్గాన్ని కేసీఆర్ ఎంచుకున్నారు: తమ్మినేని వీరభద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీపీఎం జాతీయ సమావేశాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను విమర్శించారు. రాజకీయ విధానం పార్టీకీ ముఖ్యమని, కానీ రాజకీయ విధానం ఎప్పుడు ఒకేలా ఉండదన్నారు. పరిస్థితికి అనుగుణంగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆచరణ సాధ్యం కానీ మార్గాలను ఎంచుకున్నారని, కాళేశ్వరం ఒక్కటే తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చదన్నారు. ఆంధ్రా వాళ్ళ వల్లనే మనకు ఉద్యోగాలు రావడం లేదని కేసీఆర్ చెప్పారన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. కాళేశ్వరం కేవలం ఐదు జిల్లాలకే పరిమితమైందని తమ్మినేని అన్నారు. తెలంగాణ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. సీపీఎం పార్టీ అని తెలిపారు.
Read Also: కొత్తగా 56 వేల పడకలు ఏర్పాటు చేశాం: మంత్రి హరీష్ రావు
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
రాహుల్ గాంధీ కూడా నేనే హిందువునే అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. సాఫ్టు హిందుహిజాన్ని రాహుల్ గాంధీ ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యామ్నాయం అంటే రాజకీయ ప్రత్యామ్నాయం కాదు.. ప్రజలకు అవసరం అయ్యే విధానంలో మేము ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకుంటామని తమ్మినేని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా లెఫ్ట్ పార్టీల విస్తరణ పెరిగితే బాగుంటుందని అన్నారు. తెలంగాణలో లెఫ్ట్ పార్టీల ఐక్యత కేంద్రంగా మిగిలిన శక్తుల ఐక్యత తేవాలని తమ్మినేని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో స్మశాన వాటికలకు వైకుంఠ ధామం పేరు పెడుతున్నారు. స్మశానం కాపరి శివుడు కదా… విష్ణువుకు ఏం సంబంధం అని తమ్మినేని ప్రశ్నించారు. శైవం నీ పక్కదారి పట్టించి.. వైష్ణవాణ్ణి చొప్పించే కుట్ర జరుగుతుందని తమ్మినేని అన్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తే కేసీఆర్తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కేసీఆర్తో పని చేస్తాం అంటే…ఎన్నికల్లో కలిసి పని చేస్తాం అని కాదని పోరాటాల్లోనేనని ఆయన అన్నారు ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం కలిసి పోతుంది అనుకుంటే అది భ్రమగానే మిగిలిపోతుందన్నారు. తెలంగాణలో పాలన విధానం మారకుండా రాష్ట్రం బాగుపడదని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
-
Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?