ఆచరణ సాధ్యం కాని మార్గాన్ని కేసీఆర్ ఎంచుకున్నారు: తమ్మినేని వీరభద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీపీఎం జాతీయ సమావేశాల్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను విమర్శించారు. రాజకీయ విధానం పార్టీకీ ముఖ్యమని, కానీ రాజకీయ విధానం ఎప్పుడు ఒకేలా ఉండదన్నారు. పరిస్థితికి అనుగుణంగా మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆచరణ సాధ్యం కానీ మార్గాలను ఎంచుకున్నారని, కాళేశ్వరం ఒక్కటే తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చదన్నారు. ఆంధ్రా వాళ్ళ వల్లనే మనకు ఉద్యోగాలు రావడం లేదని కేసీఆర్ చెప్పారన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. కాళేశ్వరం కేవలం ఐదు జిల్లాలకే పరిమితమైందని తమ్మినేని అన్నారు. తెలంగాణ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదు.. సీపీఎం పార్టీ అని తెలిపారు.
Read Also: కొత్తగా 56 వేల పడకలు ఏర్పాటు చేశాం: మంత్రి హరీష్ రావు
Also Read
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
రాహుల్ గాంధీ కూడా నేనే హిందువునే అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. సాఫ్టు హిందుహిజాన్ని రాహుల్ గాంధీ ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యామ్నాయం అంటే రాజకీయ ప్రత్యామ్నాయం కాదు.. ప్రజలకు అవసరం అయ్యే విధానంలో మేము ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకుంటామని తమ్మినేని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కూడా లెఫ్ట్ పార్టీల విస్తరణ పెరిగితే బాగుంటుందని అన్నారు. తెలంగాణలో లెఫ్ట్ పార్టీల ఐక్యత కేంద్రంగా మిగిలిన శక్తుల ఐక్యత తేవాలని తమ్మినేని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో స్మశాన వాటికలకు వైకుంఠ ధామం పేరు పెడుతున్నారు. స్మశానం కాపరి శివుడు కదా… విష్ణువుకు ఏం సంబంధం అని తమ్మినేని ప్రశ్నించారు. శైవం నీ పక్కదారి పట్టించి.. వైష్ణవాణ్ణి చొప్పించే కుట్ర జరుగుతుందని తమ్మినేని అన్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటం చేస్తే కేసీఆర్తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కేసీఆర్తో పని చేస్తాం అంటే…ఎన్నికల్లో కలిసి పని చేస్తాం అని కాదని పోరాటాల్లోనేనని ఆయన అన్నారు ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం కలిసి పోతుంది అనుకుంటే అది భ్రమగానే మిగిలిపోతుందన్నారు. తెలంగాణలో పాలన విధానం మారకుండా రాష్ట్రం బాగుపడదని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
-
Celebrity Updates: ప్రెగ్నెన్సీ నుంచి ఫ్యామిలీ అప్డేట్స్ వరకు.. సెలబ్రిటీల కొత్త స్టైల్ ఇదే
-
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?