Talasani Srinivas Yadav : భారీ వర్షాలు ఉన్నాయి.. అప్రమత్తంగా ఉండండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో గత రాత్రి నుంచి వర్షం కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, HMWSSB MD దాన కిషోర్తో పాటు EVDM డైరెక్టర్, జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ; నగరంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటి మట్టాలను పర్యవేక్షించడంతోపాటు, బాలస్బ్రమీమ్ను కూడా పర్యవేక్షించాలని మంత్రి అధికారులను కోరారు. నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని, కూలిన చెట్లు, కొమ్మలను జాప్యం లేకుండా తొలగించాలని ఆదేశించారు. పౌరుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు బయటకు వెళ్లవద్దని మంత్రి అభ్యర్థించారు, సహాయం కోసం GHMC కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కోరారు.
ఇదిలా ఉంటే.. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెండు రిజర్వాయర్ల నీటి మట్టాలు పెరిగి నిండుకుండను తలపిస్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం ఉదయం నుంచీ వర్షం అధికమవడంతో మొదటగా ఉదయం 8 గంటలకు ఇరు జలాశయాల రెండు గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తర్వాత మధ్యాహ్నం వరకు వరద ఉద్ధృతి పెరగడంతో .. దీనికి అనుగుణంగా ఎత్తే గేట్ల సంఖ్యను పెంచారు. హిమాయత్ సాగర్ కు 4000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. మరో 4 గేట్ల ద్వారా 4120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ కు 1600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. మరో 4 గేట్ల ద్వారా 1380 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా.. రెండు జలాశయాలకు 5600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 5500 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ను 12 గేట్ల ద్వారా మూసీ నదిలోనికి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ దానకిశోర్ సూచించారు. ఇతర సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
Also Read
- Kerala: "ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే".. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
తాజావార్తలు
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!