వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ అమెరికా, వెస్టిండీస్లో జరగనున్నాయి. అందుకు సంబంధించి.. ఈ టోర్నీకి ఇప్పటివరకు 19 జట్లు క్వాలిఫై అయ్యాయి. ఇదిలా ఉంటే.. 2022 టీ20 వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో రెండు గ్రూపుల్లో టాప్-4లో నిలిచిన మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించగా.. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీలో ఆడేందుకు స్థానాన్ని దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఆతిథ్య జట్ల హోదాలో వెస్టిండీస్, అమెరికా జట్లు కూడా టోర్నీలో పాల్గొంటున్నాయి. మరోవైపు నెదర్లాండ్స్ కూడా సాధించిన విజయాల ఆధారంగా ఆటోమేటిగ్గా క్వాలిఫై అయింది.
Read Also: Mahesh Babu: యానిమల్ కి ప్లస్ అవుతాడని బాబుని తీసుకొస్తే చివరికి బాబే మైనస్ అయ్యాడే?
ఇక.. ఐర్లాండ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా జట్లు క్వాలిఫయింగ్ టోర్నీలో నెగ్గి టీ20 వరల్డ్ కప్-2024కి క్వాలిఫై అయ్యాయి. రేపు క్వాలిఫయింగ్ టోర్నీలో ఉగాండా, కెన్యా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో ఉగాండా విజయం సాధిస్తే ఆ జట్టు కూడా టీ20 వరల్డ్ కప్ లో అడుగుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. జింబాబ్వే జట్టు కూడా టోర్నీలో పాల్గొనేందుకు స్వల్ప అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా అయితే.. ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 20 జట్లతో టీ20 వరల్డ్ కప్-2024 టోర్నీ నిర్వహించనున్నారు.
Read Also: PM Modi: “మానవత్వానికి, సమిష్టి కృషికి నిదర్శనం”.. ఉత్తరాఖండ్ టన్నెట్ రెస్క్యూపై మోడీ..
ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్-2024కు అర్హత పొందిన జట్లు ఇవే…
భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, అమెరికా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా.