BSF: ఏఐ (AI) కెమెరాలతో భారత సరిహద్దులో నిఘా..చొరబాటుదారుల కట్టడికి యత్నం
- భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ప్రత్యేక కెమెరాల వినియోగం
- కెమెరాలు.. ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతికత
- చొరబాట్లు.. నేరాలు.. ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు చర్యలు తీసుకున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది. కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సరిహద్దుల్లో నిఘా పెంచామని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇది చొరబాట్లు, నేరాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుంది. సరిహద్దు పోస్టుల వద్ద బలగాల సంఖ్యను పెంచామని, ఆ ప్రాంతాల్లోని బ్రోకర్లు, స్మగ్లర్ల నెట్వర్క్ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించామని త్రిపుర ఫ్రాంటియర్లోని BSF ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు. చోరబాటు కార్యకలాపాలకు వ్యతిరేకంగా జీరో-టాలరెన్స్ పాలసీని బీఎస్ఎఫ్ కలిగి ఉంది.
READ MORE: Rahul Gandhi: హత్రాస్ బాధితులకు పరిహారం పెంచాలి.. సీఎం యోగిని కోరిన రాహుల్ గాంధీ..
Also Read
చొరబాట్లను అరికట్టేందుకు రాష్ట్రంలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచాలని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కూడా బీఎస్ఎఫ్ని ఆదేశించారు. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు బీఎస్ఎఫ్ ఆదివారం తెలిపింది. ఇది కాకుండా.. ఇంటెన్సివ్ ప్రాంతాలలో అదనపు బృందాలను మోహరిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు మరియు ఇతర భద్రతా సంస్థలతో సంయుక్త కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కాగా.. 198 మంది బంగ్లాదేశ్ పౌరులు పట్టుబడ్డారు. దీని ఫలితాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయని బీఎస్ఎఫ్ ఐజీ తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో రూ.29 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని 198 మంది బంగ్లాదేశ్ పౌరులు, 12 మంది రోహింగ్యాలను అరెస్టు చేశారు. ఈ ఏడాది రూ.32 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జులై 1 నుంచి షిల్లాంగ్లో జరిగిన నాలుగు రోజుల ఐజీబీఎస్ఎఫ్-ప్రాంతీయ కమాండర్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) చర్చల సందర్భంగా.. బంగ్లాదేశ్ బ్రోకర్లు, నేరస్థుల జాబితాను వారికి అందించినట్లు ఐజీ చెప్పారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!