BSF: ఏఐ (AI) కెమెరాలతో భారత సరిహద్దులో నిఘా..చొరబాటుదారుల కట్టడికి యత్నం
- భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ప్రత్యేక కెమెరాల వినియోగం
- కెమెరాలు.. ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతికత
- చొరబాట్లు.. నేరాలు.. ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు చర్యలు తీసుకున్న అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది. కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సరిహద్దుల్లో నిఘా పెంచామని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇది చొరబాట్లు, నేరాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుంది. సరిహద్దు పోస్టుల వద్ద బలగాల సంఖ్యను పెంచామని, ఆ ప్రాంతాల్లోని బ్రోకర్లు, స్మగ్లర్ల నెట్వర్క్ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు ప్రారంభించామని త్రిపుర ఫ్రాంటియర్లోని BSF ఇన్స్పెక్టర్ జనరల్ తెలిపారు. చోరబాటు కార్యకలాపాలకు వ్యతిరేకంగా జీరో-టాలరెన్స్ పాలసీని బీఎస్ఎఫ్ కలిగి ఉంది.
READ MORE: Rahul Gandhi: హత్రాస్ బాధితులకు పరిహారం పెంచాలి.. సీఎం యోగిని కోరిన రాహుల్ గాంధీ..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
చొరబాట్లను అరికట్టేందుకు రాష్ట్రంలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచాలని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా కూడా బీఎస్ఎఫ్ని ఆదేశించారు. సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు బీఎస్ఎఫ్ ఆదివారం తెలిపింది. ఇది కాకుండా.. ఇంటెన్సివ్ ప్రాంతాలలో అదనపు బృందాలను మోహరిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు మరియు ఇతర భద్రతా సంస్థలతో సంయుక్త కార్యకలాపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కాగా.. 198 మంది బంగ్లాదేశ్ పౌరులు పట్టుబడ్డారు. దీని ఫలితాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయని బీఎస్ఎఫ్ ఐజీ తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో రూ.29 కోట్ల విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని 198 మంది బంగ్లాదేశ్ పౌరులు, 12 మంది రోహింగ్యాలను అరెస్టు చేశారు. ఈ ఏడాది రూ.32 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జులై 1 నుంచి షిల్లాంగ్లో జరిగిన నాలుగు రోజుల ఐజీబీఎస్ఎఫ్-ప్రాంతీయ కమాండర్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) చర్చల సందర్భంగా.. బంగ్లాదేశ్ బ్రోకర్లు, నేరస్థుల జాబితాను వారికి అందించినట్లు ఐజీ చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..