Rahul Gandhi: హత్రాస్ బాధితులకు పరిహారం పెంచాలి.. సీఎం యోగిని కోరిన రాహుల్ గాంధీ..
- హత్రాస్ బాధితులకు పరిహారం పెంచాలి..
- సీఎం యోగిని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ..
- నిందితులకు శిక్ష పడేలా విచారణ జరగాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 121 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భోలే బాబా కార్యక్రమానికి హాజరైన ప్రజలు, ఆయన పాదధూళి కోసం ఒక్కసారిగి ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటనకు కారకులైన నిందితులనున పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, హత్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం పెంచాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, యూపీ సర్కార్ని డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయన పరిహారం పెంచాలని సీఎం యోగిని కోరారు. శుక్రవారం ఆయన అలీఘర్, హత్రాస్ ప్రాంతాల్లో పర్యటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఘోర నష్టానికి పరిహారం ఎంతిచ్చిన సరిపోదని ఆయన పోస్ట్ చేశారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Amritpal Singh: అమృత్పాల్ సింగ్ నోట మళ్లీ “ఖలిస్తాన్” మాట.. తన తల్లి వ్యాఖ్యలపై మండిపాటు..
121 మంది ప్రాణాలు బలిగోన్న ఈ విషాద ఘటనలో జిల్లా యంత్రాంగం లోపాలను గుర్తించేందుకు నిష్పక్షపాత విచారణ జరగాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుందని, దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తానా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
అంతకుముందు హత్రాస్ బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 80 వేల మందికి అనుమతి ఉంటే ఇంతమంది ప్రజలు అక్కడికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ తొక్కిసలాటలో ఈవెంట్ నిర్వాహకుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రధాన నిందితుడు మేనేజర్ దేవ్ ప్రకాష్ మధుకర్ని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సేవాదార్లుగా పిచలిచే ఆరుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి భోలే బాబా కోసం వేట సాగిస్తున్న పోలీసులకు అతని ఆచూకీ కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!