Rahul Gandhi: హత్రాస్ బాధితులకు పరిహారం పెంచాలి.. సీఎం యోగిని కోరిన రాహుల్ గాంధీ..
- హత్రాస్ బాధితులకు పరిహారం పెంచాలి..
- సీఎం యోగిని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ..
- నిందితులకు శిక్ష పడేలా విచారణ జరగాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్ తొక్కిసలాట ఘటనలో 121 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భోలే బాబా కార్యక్రమానికి హాజరైన ప్రజలు, ఆయన పాదధూళి కోసం ఒక్కసారిగి ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ఘటనకు కారకులైన నిందితులనున పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే, హత్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం పెంచాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, యూపీ సర్కార్ని డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా ఆయన పరిహారం పెంచాలని సీఎం యోగిని కోరారు. శుక్రవారం ఆయన అలీఘర్, హత్రాస్ ప్రాంతాల్లో పర్యటించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ ఘోర నష్టానికి పరిహారం ఎంతిచ్చిన సరిపోదని ఆయన పోస్ట్ చేశారు.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
Read Also: Amritpal Singh: అమృత్పాల్ సింగ్ నోట మళ్లీ “ఖలిస్తాన్” మాట.. తన తల్లి వ్యాఖ్యలపై మండిపాటు..
121 మంది ప్రాణాలు బలిగోన్న ఈ విషాద ఘటనలో జిల్లా యంత్రాంగం లోపాలను గుర్తించేందుకు నిష్పక్షపాత విచారణ జరగాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుందని, దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తానా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
అంతకుముందు హత్రాస్ బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 80 వేల మందికి అనుమతి ఉంటే ఇంతమంది ప్రజలు అక్కడికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ తొక్కిసలాటలో ఈవెంట్ నిర్వాహకుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రధాన నిందితుడు మేనేజర్ దేవ్ ప్రకాష్ మధుకర్ని శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సేవాదార్లుగా పిచలిచే ఆరుగురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి భోలే బాబా కోసం వేట సాగిస్తున్న పోలీసులకు అతని ఆచూకీ కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!