Supreme Court: గొడవలు జరిగితే భర్త ఉద్యాగాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు ఆందోళన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: వైవాహిక విభేదాలు వచ్చినప్పుడు భర్త పనిచేసే సంస్థకు ఫిర్యాదు భార్య ఫిర్యాదు చేయడం, ఉద్యోగం ఊడేలా ప్రయత్నించడం ఎంత వరకు కరెక్ట్? దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్యాభర్తల గొడవల సమయంలో చాలామంది మహిళలు భర్త యాజమాన్యానికి ఉత్తరాలు రాస్తున్నారని, ఇది చాలా తప్పుడు పద్ధతి అని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఓ కేసుకు సంబంధించిన బదిలీ పిటిషన్ను విచారిస్తున్నప్పుడు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకులు కోరడం వేరని, కానీ భాగస్వామి ఉపాధిని దెబ్బతీయడం అత్యంత దారుణమైన విషయమని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. భర్త ఉద్యోగం పోతే, ఆ తర్వాత ఆమెకు అందాల్సిన పోషణ ఖర్చుల (మెయింటెనెన్స్) దావాకు కూడా ఎలాంటి ఆధారం లేకుండా పోతుందని హెచ్చరించారు.
ఈ విచారణ వెనుక ఓ పెద్ద వివాదమే ఉంది. గజియాబాద్కు చెందిన ఓ మహిళ, తనపై అస్సాంలో నమోదైన పరువు నష్టం కేసును గజియాబాద్కు మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే గజియాబాద్లో భర్తపై అనేక కేసులు నడుస్తున్నాయని కోర్టుకు తెలిపింది. అయితే ఈ పరువు నష్టం కేసు నేరుగా భర్త వేసింది కాదు. ఎయిర్ ఫోర్స్ అధికారి అయిన తన భర్త, సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా సొంత వ్యాపారం నడుపుతున్నాడంటూ సదరు మహిళ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త స్నేహితుడు, సహోద్యోగి ఈ పరువు నష్టం దావా వేశారు.
Also Read
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
ఈ ఫిర్యాదు వెనుక తన వద్ద బలమైన కారణం ఉందంటూ మహిళ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. భర్తే ముందుగా తమపై ఎయిర్ ఫోర్స్ హెల్మెట్ దొంగిలించారంటూ అసత్య ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు. ఆ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవడానికే తాను ఎయిర్ ఫోర్స్ అధికారులకు వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న న్యాయస్థానం, ఈ వ్యవహారాన్ని పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కేంద్రానికి (మీడియేషన్ సెంటర్) పంపింది. అంతేకాకుండా, గొడవలన్నీ సర్దుమనుచుకుని మోపిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని సదరు మహిళకు సలహా ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాదికి జస్టిస్ నాగరత్న సూచించారు.
తాజావార్తలు
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
-
King 100: నాగ్100పై సస్పెన్స్కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
-
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!