Supreme Court Collegium: 13 మంది న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Collegium: హైకోర్టు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు. ఇందులో గౌహతి హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు ఎన్.ఉన్ని కృష్ణన్ నాయర్, కౌశిక్ గోస్వామి పేర్లను సిఫార్సు చేశారు. గౌహతి హైకోర్టుకు ఈ 2 పేర్లను సిఫార్సు చేశారు. సుప్రీం కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తీర్మానంలో.. మే 29, 2023న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తన ఇద్దరు సీనియర్-సహోద్యోగులతో సంప్రదించి, పైన పేర్కొన్న న్యాయవాదులను ఆ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేశారు.
Also Read: NewsClick Case : హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ప్రబీర్ పుర్కాయస్థ
Also Read
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
హైకోర్టుకు పదోన్నతి పొందేందుకుఅభ్యర్థుల అర్హత, అనుకూలతను అంచనా వేయడానికి న్యాయ శాఖ చేసిన పరిశీలనలతో పాటు నిర్దిష్ట అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులతో సహా రికార్డులో ఉంచిన అంశాలను పరిశీలించి, మూల్యాంకనం చేశామని కొలీజియం పేర్కొంది. ఫైల్లో న్యాయ శాఖ చేసిన వ్యాఖ్యలతో పాటు కొంతమంది అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులను కూడా అధ్యయనం చేశామని తెలిపింది. మరో నిర్ణయంలో, ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం న్యాయవాదులు సిద్ధార్థ్ సా, అలోక్ మహారా పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.
న్యాయవాదులు హర్మీత్ సింగ్ గ్రేవాల్, దీపిందర్ సింగ్ నల్వా, సుమీత్ గోయల్, సుదీప్తి శర్మ, కీర్తి సింగ్ పేర్లను కూడా పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం న్యాయవాదులు వినయ్ సరాఫ్, వివేక్ జైన్, ఆశిష్ శ్రోతి, అమిత్ సేథ్ పేర్లను కూడా కొలీజియం సిఫార్సు చేసింది.
తాజావార్తలు
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
-
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్లో ఎమోషనల్ ఫేర్వెల్?
-
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..