Supreme Court Collegium: 13 మంది న్యాయవాదుల పేర్లను హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Collegium: హైకోర్టు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం వివిధ హైకోర్టులకు న్యాయమూర్తులుగా 13 మంది న్యాయవాదుల పేర్లను సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు. ఇందులో గౌహతి హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు ఎన్.ఉన్ని కృష్ణన్ నాయర్, కౌశిక్ గోస్వామి పేర్లను సిఫార్సు చేశారు. గౌహతి హైకోర్టుకు ఈ 2 పేర్లను సిఫార్సు చేశారు. సుప్రీం కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తీర్మానంలో.. మే 29, 2023న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తన ఇద్దరు సీనియర్-సహోద్యోగులతో సంప్రదించి, పైన పేర్కొన్న న్యాయవాదులను ఆ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేశారు.
Also Read: NewsClick Case : హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ప్రబీర్ పుర్కాయస్థ
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
హైకోర్టుకు పదోన్నతి పొందేందుకుఅభ్యర్థుల అర్హత, అనుకూలతను అంచనా వేయడానికి న్యాయ శాఖ చేసిన పరిశీలనలతో పాటు నిర్దిష్ట అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులతో సహా రికార్డులో ఉంచిన అంశాలను పరిశీలించి, మూల్యాంకనం చేశామని కొలీజియం పేర్కొంది. ఫైల్లో న్యాయ శాఖ చేసిన వ్యాఖ్యలతో పాటు కొంతమంది అభ్యర్థులపై వచ్చిన ఫిర్యాదులను కూడా అధ్యయనం చేశామని తెలిపింది. మరో నిర్ణయంలో, ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం న్యాయవాదులు సిద్ధార్థ్ సా, అలోక్ మహారా పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.
న్యాయవాదులు హర్మీత్ సింగ్ గ్రేవాల్, దీపిందర్ సింగ్ నల్వా, సుమీత్ గోయల్, సుదీప్తి శర్మ, కీర్తి సింగ్ పేర్లను కూడా పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకం కోసం న్యాయవాదులు వినయ్ సరాఫ్, వివేక్ జైన్, ఆశిష్ శ్రోతి, అమిత్ సేథ్ పేర్లను కూడా కొలీజియం సిఫార్సు చేసింది.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!