NewsClick Case : హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ప్రబీర్ పుర్కాయస్థ
NewsClick Case: దేశ వ్యతిరేక కార్యకలాపాల కేసులో ‘న్యూస్క్లిక్’ వెబ్సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యూస్క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిల అరెస్టుపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో కేసు పెట్టారు. ఈ అంశంపై గురువారం (అక్టోబర్ 19) విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తి తమ అరెస్టును సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నోటీసు లేకుండా జర్నలిస్టు అరెస్ట్: కపిల్ సిబల్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తి ‘దేశ వ్యతిరేక’ ప్రచారాన్ని ప్రోత్సహించడానికి చైనా నుంచి నిధులను సమకూరుస్తున్నారనే ఆరోపణలపై ఉపా చట్టం కింద తమ అరెస్టు, నిర్బంధాన్ని వారు సవాలు చేశారు. 75 ఏళ్ల జర్నలిస్టును నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారని, ఇది సరికాదని కోర్టులో ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. హైకోర్టు మాకు ఉపశమనం కలిగించలేదని, ముందస్తు విచారణ కోసం సుప్రీంకోర్టును అభ్యర్థిస్తున్నామని కపిల్ సిబల్ అన్నారు.
Also Read: Marriage Age of Girls: ఆడపిల్లల వివాహ వయస్సు పెంచుతారా?
ఇంతకీ, ప్రబీర్ పుర్కాయస్థను ఢిల్లీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు?
గ్లోబల్, డొమెస్టిక్ స్థాయిలో కథనాలను సృష్టిస్తూనే, కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లను వివాదాస్పద ప్రాంతాలుగా అభివర్ణిస్తున్నారని న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడిని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆరోపించింది. అంతేకాకుండా, భారతదేశం మ్యాప్ను తారుమారు చేయడం ద్వారా ఐక్యత, ప్రాదేశిక సమగ్రతపై దాడి చేశారని కూడా ఆరోపించారు. న్యూస్క్లిక్ న్యూస్ వెబ్సైట్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, ఆయన సహచరులు జోసెఫ్ రాజ్, అనూప్ చక్రవర్తి (అమిత్ చక్రవర్తి సోదరుడు), బప్పాదిత్య సిన్హా (వర్ట్యూనెట్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్) అక్రమ మార్గాల్లో డబ్బును సేకరించేవారని కూడా పోలీసులు తెలిపారు. ఈ డబ్బును తీస్తా సెతల్వాద్ సహచరులు గౌతమ్ నవ్లాఖా, జావేద్ ఆనంద్, తమరా, జిబ్రాన్, ఊర్మిళేష్, ఆరాత్రిక హల్దర్, పరంజయ్ గుహా ఠాకుర్తా, త్రినా శంకర్ మరియు జర్నలిస్టు అభిసర్ శర్మకు పంచారని కూడా ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో