AP Government: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సర్కార్ సీరియస్.. ఫిర్యాదుకు రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. ఫిర్యాదుకు రంగం సిద్ధం చేస్తోంది.. సంబంధిత కోర్టులో ఫిర్యాదు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం.. తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సూచించింది..
Read Also: Heavy Rains: ముంబైలో దంచికొడుతున్న వానలు.. ఓ గ్రామంపై విరిగిపడ్డ కొండచరియలు
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
కాగా, వారాహి విజయాత్ర పేరుతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు పవన్ కల్యాణ్.. ఇక, రెండో విడత వారాహి యాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్ వ్యవస్థపై త్వరలోనే కోర్టుకు వెళ్తామని ప్రకటించిన ఆయన.. గ్రామ, వార్డు వాలంటీర్ల రూపంలో ప్రతి 50 ఇళ్లకు ఒక జగన్ తయారయ్యాడని ఆరోపించారు.. ఇక, వారు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ ఉంచుతున్నారని ప్రశ్నించారు. వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు అసలు వాలంటీర్లు ఎవరని నిలదీశారు. సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్ వ్యవస్థ తోడ్పాటు అందిస్తోందని ఆరోపించిన ఆయన.. హ్యూమన్ ట్రాఫికింగ్కి కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, పవన్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది.. వలంటీర్లపై దురద్దేశపూర్వకంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.. పవన్ దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు.. ఇప్పుడు.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!