Hyderabad: మణికొండ తల్లీకూతుళ్ల ఆత్మహత్యలో ట్విస్ట్.. రెండేళ్లుగా ఇంట్లోనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లోని మణికొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకున్న వారిని అలువేలు (40), లాస్య (14) గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. సదానందం, అలివేలు దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. సదానందం ఉద్యోగం మానేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నట్లు స్తానికులు చెబుతున్నారు. కుటుంబంలో ఇటీవల చిన్ని చిన్న గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే తల్లి అలివేలు తన కూతురు లాస్య (14) కి ఉరి వేసి చంపి… ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. ఎనిమిదేళ్ళ కొడుకు గాఢ నిద్రలో ఉండడంతో తనను చంపే ప్రయత్నాన్ని మానుకున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలం నుంచి తీవ్ర మానసిక వేదనలో తల్లీ కూతురు ఉన్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. కరోనా సమయం నుంచి ఇంటి నుంచి తల్లి అలివేలు బయటికే రాలేదని చెబుతున్నారు.
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
Read Also:Gudivada Amarnath: కేసీఆర్ ఓసారి అచ్యుతాపురం రండి.. ఎకరా రేటు ఎంతో తెలుస్తుంది..
ఈమెతో పాటు కూతురు లాస్య కూడా రెండేళ్లుగా ఇంటికే పరిమితమైంది. ప్లాన్ ప్రకారమే పిల్లలు చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు భర్త సదానందంను దూరంగా పంపిందని తెలుస్తోంది. భర్తకు రూ. 5 వేలు ఇచ్చి యాదాద్రి వెళ్లమని బలవంతంగా పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆత్మహత్య చేసుకున్న తల్లీ కూతుర్లు చేతులపై కొన్ని వ్యాక్యాలు గోరింటాకుతో రాసుకున్నారు. కూతురు చేతి పై do something that make you happy అని, The game is started అని రాసుకున్నారు.
ఆత్మహత్య కి ముందు.. తల్లీ కూతుళ్ళు ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టారు. ఈవిషయంపై రాయదుర్గం సీఐ మహేష్ వివరణ ఇస్తూ లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగా లేదని తెలిపారు. రెండేళ్లుగా ఇల్లు దాటి బయటకు రావడం లేదు.. ఇంటి పక్కన వాళ్ళతో కూడా మాట్లాడటం లేదని చెప్పారు. ఆత్మహత్య కి ముందు.. తల్లీ కూతుళ్లు ఇంట్లో ఉన్న పాత బట్టలు తగలబెట్టుతుండగా ప్రశ్నించిన కొడుకును నీకేం తెలియని వారించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. తల్లీ కూతుళ్ల ఆత్మహత్యపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Read Also:PM Modi Speech: 58 నిమిషాల్లో 79 సార్లు చప్పట్లు.. పార్లమెంట్ను ఊపేసిన మోడీ మేనియా
తాజావార్తలు
-
PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
-
New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?
-
Biggest Disaster : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్.. బడ్జెట్ రూ. 1400 కోట్లు.. కలెక్షన్స్ రూ. 6 కోట్లు
-
Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!