Gudivada Amarnath: కేసీఆర్ ఓసారి అచ్యుతాపురం రండి.. ఎకరా రేటు ఎంతో తెలుస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: తెలుగు రాష్ట్రాల్లో భూముల ధరలు ఇప్పుడు రెండు రాష్ట్రాల నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలకు దారి తీస్తున్నాయి.. తెలంగాణలో ఎకరం భూమి అమ్మి ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు భూమి కొంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు అన్న ఆ మాటలను ఇప్పుడు కేసీఆర్ ఉటంకించారు. ఏపీలో సీఎం జగన్ వల్ల సంపద నాశనం అయిపోయిందని, భూముల రేట్లు పడిపోయాయని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు.. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో నాలుగైదు ఎకరాలు కొనేవాళ్లని, జగన్ వచ్చాక పరిస్థితి తారుమారైందని విమర్శించిన ఆయన.. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితో ఆంధ్రాలో 50 ఎకరాలు వస్తుందని.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా వంద ఎకరాలు కూడా కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు.. అయితే, తాజాగా చంద్రబాబు మాటలను పటాన్చెరు పర్యటనలో భాగంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు..
Read Also: TS Govt :ఉద్యోగులు, పింఛనర్లకు గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం..
Also Read
- Satya Kumar Yadav: 'ఎబోలా'పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
- Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
- RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ఇప్పటికే ఓసారి తెలంగాణలో, ఏపీలో భూముల ధరలపై హాట్ కామెంట్లు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ వ్యవహారంలో మరోసారి స్పందించారు.. ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్యుతాపురం వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందన్నారు.. ఏపీలో భూముల విలువలు తగ్గాయని చంద్రబాబు, కేసీఆర్కు చెప్పరంటా అని ఎద్దేవా చేసిన ఆయన.. ఒకసారి అచ్యుతాపురం కేసీఆర్ వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందని సూచించారు.. అచ్యుతాపురంలో ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాల కొనవచ్చని చెబుతూ కేసీఆర్ కామెంట్స్కు కౌంటర్ ఇచ్చారు.. ఇక, గడప గడపకు వెళ్లకపోతే ఎమ్మెలే సీట్లు ఉండవని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.. అంత దైర్యంగా చెప్పిన నేత మరొకరు లేరన్నారు అమర్నాథ్.. టీడీపీ నేతల భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. వారు ప్రజల భవిష్యత్తుకు ఏమి గ్యారెంటీ ఇస్తారు? అని ప్రశ్నించారు. కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తారు.. సీఎం విజయాన్ని అడ్డుకునే సత్తా చంద్రబాబు ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్కు లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
తాజావార్తలు
-
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
-
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్..
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?