PM Modi: ప్రధాన మంత్రిని కలిసిన ఎస్సీ హాస్టల్ విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎస్సీ హాస్టల్స్ కు చెందిన విద్యార్థులు తమ విజ్ఞాన యాత్రలో భాగంగా ఢిల్లీలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని కలిసి మాట్లాడారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారికి పుస్తకాలను కూడా బహూకరించారని వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్ తన సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో ఈ యాత్ర ఏర్పాటు చేసినట్లు నాగార్జున చెప్పారు. ఈ యాత్రలో రాష్ట్రంలోని వైయస్సార్ కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ హాస్టళ్లలోని ప్రతిభావంతులైన 42 మంది బాల, బాలికలు పాల్గొన్నారన్నారు. ఈ నెల 14 నుంచి 19 దాకా కొనసాగిన ఈ యాత్రలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులు అక్కడి పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగానే విద్యార్థులతో కొద్ది సమయాన్ని గడిసిన ప్రధాని వారితో ముచ్చటించారని వారి ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
Read Also: India Power Consumption: దేశంలో పెరిగిన విద్యుత్ వినియోగం..
Also Read
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
ముఖ్యంగా స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు, స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవిత గాథలు చదివి వాటి ద్వారా స్ఫూర్తిని పొందాలని ప్రధాని విద్యార్థులకు సూచించినట్లు వారు తెలిపారు. పరీక్షలంటే భయపడవద్దని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవి తమ భవిష్యత్తును ఉజ్వలంగా మలచుకోవాలని విద్యార్థులకు హితవు చెప్పారన్నారు. సంపాదించిన ధనాన్ని వృధా చేయకుండా పొదుపు చేయాలని కోరడంతో పాటుగా జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి వాటి ద్వారా పొదుపును ప్రారంభించాలని ప్రధాని ఈ సందర్భంగానే విద్యార్థులకు సూచించారని నాగార్జున వెల్లడించారు. తమ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాలను కూడా ప్రధాని బహూకరించి వారితో ఫోటోలు దిగారని చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు పార్లమెంటును సందర్శించగా అక్కడి అధికారులు పార్లమెంటులో ఎవరు ఎక్కడ కూర్చుంటారనే వివరాలను విద్యార్థులకు తెలుపుతూ పార్లమెంటు మొత్తాన్ని చూపించారని తెలిపారు.
తాజావార్తలు
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
-
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..