Stock Markets: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులకు భారీ నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్ సెషన్లో స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ముగిసింది. ఈ క్రమంలో.. సెన్సెక్స్ 1062, నిఫ్టీ 335 పాయింట్లు పడిపోయాయి. దీంతో.. పెట్టుబడిదారులకు భారీ నష్టం ఏర్పడింది. ఈ వారంలో ఇదే అతిపెద్ద పతనం. ఈ రోజు ఉదయం పరిమిత శ్రేణిలో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. పెట్టుబడిదారులు మార్కెట్లో పెరుగుదలను ఆశించారు. అయితే మధ్యాహ్నం ఒంటి గంటకు మార్కెట్లో భారీ పతనంతో ట్రేడింగ్ ప్రారంభమైంది.
నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 1062.22 పాయింట్లతో 1.45 శాతం తగ్గి 72,404.17 వద్దకు చేరుకుంది. నిఫ్టీ కూడా 335.40 పాయింట్లతో 1.5 శాతం క్షీణించి 21,967.10 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లో ఈ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.3 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. దీనివల్ల బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 400 లక్షల కోట్ల దిగువన రూ. 393.73 లక్షల కోట్లకు పడిపోయిందని ఇటి నివేదిక తెలిపింది.
Also Read
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
- CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
- CJP Protest: ‘ఛలో పార్లమెంట్’ ఉద్యమంలో కీలక పరిణామం..
- Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
Gangs Of Godavari: వెనక్కి వెళ్లిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. ఈసారి ఏకంగా ఐదు సినిమాలతో పోటీ?
టాప్ 30 BSE లిస్టెడ్ షేర్లలో 25 షేర్లలో ఈరోజు భారీ పతనం జరిగింది. కేవలం 5 షేర్లు మాత్రమే పెరిగాయి. టాటా మోటార్స్ షేర్లో దాదాపు 2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.48 శాతం, ఎస్బిఐ షేర్లో 1.27 శాతం, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. నష్టపోతున్న 25 స్టాక్స్లో ఎల్అండ్టి షేరు 5.56 శాతం క్షీణించింది. దీని తర్వాత.. ఏషియన్ పెయింట్స్, JSW స్టీల్, ITC, బజాజ్ ఫైనాన్స్ మరియు ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 5 శాతం వరకు పడిపోయాయి.
ఎల్ అండ్ టీ షేర్లు ఈరోజు దాదాపు 6 శాతం క్షీణించి రూ.3275కి చేరుకున్నాయి. అంతే కాకుండా.. పవర్ ఫైనాన్స్ షేర్లు 5 శాతం, బిపిసిఎల్ 5 శాతం, పిరమిల్ ఎంటర్ప్రైజెస్ 9 శాతం, ఎన్హెచ్పిసి 5.26 శాతం, మణప్పురం ఫైనాన్స్ 8 శాతం పడిపోయాయి. స్టాక్ మార్కెట్ లో ఈరోజు ఇన్వెస్టర్లు రూ.7.3 లక్షల కోట్లు నష్టపోయారు. ఎందుకంటే గురువారం, బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.7.3 లక్షల కోట్లు తగ్గి రూ.393.73 లక్షల కోట్లకు చేరుకుంది, ఇది అంతకుముందు రోజు రూ.400 లక్షల కోట్ల మార్కులో ఉంది.
తాజావార్తలు
-
Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
-
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Toxic: ‘టాక్సిక్’ నుంచి మరో సర్ప్రైజ్.. యష్తో ఈసారి తారా సుతారియా రొమాన్స్!
-
Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
ట్రెండింగ్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!