Andhra Pradesh: ఎస్ఐపీబీలో రూ.85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ తొలి సమావేశం
- తొలి సమావేశంలో రూ.85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం
- నిరుద్యోగులకు 33,966 ఉద్యోగాల కల్పన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తొలి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నారాయణ, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, కందుల దుర్గేశ్, గొట్టిపాటి రవికుమార్,సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్, పలుపురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎస్ఐపీబీ తొలి సమావేశంలో 85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైంది. రూ.85,053 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. నిరుద్యోగులకు 33,966 ఉద్యోగాల కల్పనకు అనుమతిస్తూ నిర్ణయం తీసకున్నారు. 10 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రాగా వాటిలో ప్రధానంగా ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.61,780 కోట్ల పెట్టుబడితో 2029 నాటికి 21 వేల మందికి ఉపాధి కల్పించనుంది. కల్యాణి స్ట్రాటెజీ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.1,430 కోట్ల పెట్టుబడితో 565 మందికి ఉపాధి కల్పించనుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.5,001 కోట్ల పెట్టుబడితో 1495 మందికి ఉపాధి లభించనుంది. టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 76 కోట్ల పెట్టుబడితో 250 ఉద్యోగాలు లభించనున్నాయి.
Also Read
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
Read Also: Purandeswari: వికలాంగ క్రీడాకారిణికి ధైర్యం నింపిన ఎంపీ పురంధేశ్వరి
ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రూ3,798 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉపాధి లభించనుంది. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి. డల్లాస్ టెక్నాలజీ రూ.50 కోట్లు పెట్టుబడి పెడుతుండగా… 2వేల మందికి ఉపాధి కలగనుంది. గ్రీన్కో ఏపీ01 సోలార్ రూ.2వేల కోట్లు పెట్టుబడి పెడుతుండగా.. 1725 మందికి ఉపాధి లభించనుంది. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా లిమిటెడ్ రూ.8,240 కోట్లు పెట్టుబడి(4వేల ఉద్యోగాలు), ఎకొరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,662 కోట్ల పెట్టబడితో 350 మందికి ఉపాధి కలగనుంది. ఉద్యోగాల సంఖ్య మేరకు,ఇటీవల ప్రకటించిన ఏపీ పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
తాజావార్తలు
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Jailer 2 : రజనీకాంత్ సినిమాలకు హైప్ తీసుకొస్తున్న ఐటంసాంగ్స్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
ట్రెండింగ్
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?