Andhra Pradesh: ఎస్ఐపీబీలో రూ.85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ తొలి సమావేశం
- తొలి సమావేశంలో రూ.85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమం
- నిరుద్యోగులకు 33,966 ఉద్యోగాల కల్పన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు తొలి సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నారాయణ, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, కందుల దుర్గేశ్, గొట్టిపాటి రవికుమార్,సుభాష్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్, పలుపురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఎస్ఐపీబీ తొలి సమావేశంలో 85,083 కోట్ల పెట్టుబడులకు మార్గం సుగమమైంది. రూ.85,053 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. నిరుద్యోగులకు 33,966 ఉద్యోగాల కల్పనకు అనుమతిస్తూ నిర్ణయం తీసకున్నారు. 10 కంపెనీలు పెట్టుబడులకు ముందుకు రాగా వాటిలో ప్రధానంగా ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.61,780 కోట్ల పెట్టుబడితో 2029 నాటికి 21 వేల మందికి ఉపాధి కల్పించనుంది. కల్యాణి స్ట్రాటెజీ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.1,430 కోట్ల పెట్టుబడితో 565 మందికి ఉపాధి కల్పించనుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.5,001 కోట్ల పెట్టుబడితో 1495 మందికి ఉపాధి లభించనుంది. టాఫే ఫరేషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 76 కోట్ల పెట్టుబడితో 250 ఉద్యోగాలు లభించనున్నాయి.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Read Also: Purandeswari: వికలాంగ క్రీడాకారిణికి ధైర్యం నింపిన ఎంపీ పురంధేశ్వరి
ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ రూ3,798 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉపాధి లభించనుంది. ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్ రూ.1,046 కోట్ల పెట్టుబడితో 2,381 మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి. డల్లాస్ టెక్నాలజీ రూ.50 కోట్లు పెట్టుబడి పెడుతుండగా… 2వేల మందికి ఉపాధి కలగనుంది. గ్రీన్కో ఏపీ01 సోలార్ రూ.2వేల కోట్లు పెట్టుబడి పెడుతుండగా.. 1725 మందికి ఉపాధి లభించనుంది. ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా లిమిటెడ్ రూ.8,240 కోట్లు పెట్టుబడి(4వేల ఉద్యోగాలు), ఎకొరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,662 కోట్ల పెట్టబడితో 350 మందికి ఉపాధి కలగనుంది. ఉద్యోగాల సంఖ్య మేరకు,ఇటీవల ప్రకటించిన ఏపీ పారిశ్రామిక పాలసీకి అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశంలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
తాజావార్తలు
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!