Richest Cricketer: ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా.. ఎన్ని కోట్లంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో అత్యంత ధనవంతులైన క్రికెటర్స్ ఎవరు అని అడిగితే ముందుగా ధోని, సచిన్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్ల పేర్లు వినిపిస్తాయి. విరాట్ కోహ్లి తన నికర విలువ రూ. 1,000 కోట్లు దాటిందని ఇటీవల వార్తలొచ్చాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నికర విలువ రూ. 1,250 కోట్లు, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నికర విలువ రూ. 1,040గా అంచనా వేయబడింది. అయితే వీరందరిని మించి ఆస్తులున్నాయని ఓ క్రెకెటర్ పేరు వినపడుతుంది. అయితే అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. కేవలం రంజీ క్రికెట్ లోనే ఆడాడు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా..?
Railways: రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త.. ట్రైన్ టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గింపు!
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
గుజరాత్లోని బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్జిత్ రంజిత్సిన్హ్ గైక్వాడ్. ఈయన ఆస్తి విలువ సుమారు రూ.20,000 కోట్లకు పైమాటే. రంజిత్సిన్హ్ గైక్వాడ్కు ఇంత ఆస్తి ఉండటానికి కారణం అతని కుటుంబ నేపథ్యమే. అతను రాజవంశానికి చెందినవాడు. వడోదర మహారాజు రంజిత్సిన్హ్ ప్రతాప్ గైక్వాడ్, శుభన్గిని రాజేల ఏకైక కుమారుడే సమర్జిత్ రంజిత్సిన్హ్ గైక్వాడ్. అతను ఏప్రిల్ 25, 1967న జన్మించాడు. డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నాడు.
Botsa Satyanarayana: బాధ్యతగా మాట్లాడాలి.. రండి బహిరంగ చర్చకు..
2012 మేలో తన తండ్రి మరణం అనంతరం సమర్జిత్కు మహారాజుగా పట్టాభిషేకం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్, మోతి బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం యజమాని ఇతనే. అంతేకాకుండా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ సమీపంలో 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ భూములు కూడా ఉన్నాయి. గుజరాత్, బెనారస్లలో 17దేవాలయాలను, ట్రస్ట్లను కూడా నిర్వహిస్తున్నారు. 2002లో వంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని సమర్జిత్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. బరోడా తరఫున 1987-89 మధ్య రంజీ ట్రోఫీలో ఆరు మ్యాచ్లు ఆడారు. అంతేకాకుండా బరోడా క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగానూ పనిచేశారు.
తాజావార్తలు
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!