Richest Cricketer: ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా.. ఎన్ని కోట్లంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో అత్యంత ధనవంతులైన క్రికెటర్స్ ఎవరు అని అడిగితే ముందుగా ధోని, సచిన్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్ల పేర్లు వినిపిస్తాయి. విరాట్ కోహ్లి తన నికర విలువ రూ. 1,000 కోట్లు దాటిందని ఇటీవల వార్తలొచ్చాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నికర విలువ రూ. 1,250 కోట్లు, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నికర విలువ రూ. 1,040గా అంచనా వేయబడింది. అయితే వీరందరిని మించి ఆస్తులున్నాయని ఓ క్రెకెటర్ పేరు వినపడుతుంది. అయితే అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. కేవలం రంజీ క్రికెట్ లోనే ఆడాడు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా..?
Railways: రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త.. ట్రైన్ టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గింపు!
Also Read
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
గుజరాత్లోని బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్జిత్ రంజిత్సిన్హ్ గైక్వాడ్. ఈయన ఆస్తి విలువ సుమారు రూ.20,000 కోట్లకు పైమాటే. రంజిత్సిన్హ్ గైక్వాడ్కు ఇంత ఆస్తి ఉండటానికి కారణం అతని కుటుంబ నేపథ్యమే. అతను రాజవంశానికి చెందినవాడు. వడోదర మహారాజు రంజిత్సిన్హ్ ప్రతాప్ గైక్వాడ్, శుభన్గిని రాజేల ఏకైక కుమారుడే సమర్జిత్ రంజిత్సిన్హ్ గైక్వాడ్. అతను ఏప్రిల్ 25, 1967న జన్మించాడు. డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నాడు.
Botsa Satyanarayana: బాధ్యతగా మాట్లాడాలి.. రండి బహిరంగ చర్చకు..
2012 మేలో తన తండ్రి మరణం అనంతరం సమర్జిత్కు మహారాజుగా పట్టాభిషేకం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్, మోతి బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం యజమాని ఇతనే. అంతేకాకుండా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ సమీపంలో 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ భూములు కూడా ఉన్నాయి. గుజరాత్, బెనారస్లలో 17దేవాలయాలను, ట్రస్ట్లను కూడా నిర్వహిస్తున్నారు. 2002లో వంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని సమర్జిత్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. బరోడా తరఫున 1987-89 మధ్య రంజీ ట్రోఫీలో ఆరు మ్యాచ్లు ఆడారు. అంతేకాకుండా బరోడా క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగానూ పనిచేశారు.
తాజావార్తలు
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!