Richest Cricketer: ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా.. ఎన్ని కోట్లంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియాలో అత్యంత ధనవంతులైన క్రికెటర్స్ ఎవరు అని అడిగితే ముందుగా ధోని, సచిన్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్ల పేర్లు వినిపిస్తాయి. విరాట్ కోహ్లి తన నికర విలువ రూ. 1,000 కోట్లు దాటిందని ఇటీవల వార్తలొచ్చాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నికర విలువ రూ. 1,250 కోట్లు, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నికర విలువ రూ. 1,040గా అంచనా వేయబడింది. అయితే వీరందరిని మించి ఆస్తులున్నాయని ఓ క్రెకెటర్ పేరు వినపడుతుంది. అయితే అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. కేవలం రంజీ క్రికెట్ లోనే ఆడాడు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా..?
Railways: రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త.. ట్రైన్ టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గింపు!
Also Read
- Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
- Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
- WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
- Sharad Pawar: విదేశీ పర్యటనలతో దేశ ప్రతిష్టతను కాపాడుతున్నారు.. మోడీపై శరద్పవార్ ప్రశంసలు
గుజరాత్లోని బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్జిత్ రంజిత్సిన్హ్ గైక్వాడ్. ఈయన ఆస్తి విలువ సుమారు రూ.20,000 కోట్లకు పైమాటే. రంజిత్సిన్హ్ గైక్వాడ్కు ఇంత ఆస్తి ఉండటానికి కారణం అతని కుటుంబ నేపథ్యమే. అతను రాజవంశానికి చెందినవాడు. వడోదర మహారాజు రంజిత్సిన్హ్ ప్రతాప్ గైక్వాడ్, శుభన్గిని రాజేల ఏకైక కుమారుడే సమర్జిత్ రంజిత్సిన్హ్ గైక్వాడ్. అతను ఏప్రిల్ 25, 1967న జన్మించాడు. డెహ్రాడూన్లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నాడు.
Botsa Satyanarayana: బాధ్యతగా మాట్లాడాలి.. రండి బహిరంగ చర్చకు..
2012 మేలో తన తండ్రి మరణం అనంతరం సమర్జిత్కు మహారాజుగా పట్టాభిషేకం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్, మోతి బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం యజమాని ఇతనే. అంతేకాకుండా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ సమీపంలో 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ భూములు కూడా ఉన్నాయి. గుజరాత్, బెనారస్లలో 17దేవాలయాలను, ట్రస్ట్లను కూడా నిర్వహిస్తున్నారు. 2002లో వంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని సమర్జిత్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. బరోడా తరఫున 1987-89 మధ్య రంజీ ట్రోఫీలో ఆరు మ్యాచ్లు ఆడారు. అంతేకాకుండా బరోడా క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగానూ పనిచేశారు.
తాజావార్తలు
-
Motorola Razr Fold: మోటరోలా రేజర్ ఫోల్డ్ సేల్ స్టార్ట్.. రూ. 10000 డిస్కౌంట్! 6,000mAh బ్యాటరీ, 8.1-అంగుళాల స్క్రీన్
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!