Fishermen Arrest: తమిళనాడుకు చెందిన 9 మంది జాలర్లు అరెస్ట్.. ఆగ్రహంతో మత్స్యకార సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడుకు చెందిన 9 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుంది. సముద్ర సరిహద్దును ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారని రాష్ట్ర మత్స్యశాఖ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. వారివద్ద నుంచి రెండు మెకనైజ్డ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. రామనాథపురం జిల్లాలోని మండపానికి చెందిన మత్స్యకారులు సోమవారం ఉదయం చేపల వేటకు వెళ్లగా నిన్న అర్థరాత్రి కచ్చతీవు- నెడుంతీవు మధ్య వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు వారిని అరెస్ట్ చేయడంపై మత్స్యకార సంఘాలు మండిపడుతున్నాయి.
Minister Roja: సమ్మక్క- సారక్క రీ యూనియన్.. కన్నుల పండుగగా ఉందే
Also Read
- Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
సోమవారం ఉదయం మండపం ప్రాంతం నుంచి 200కు పైగా పడవల్లో మత్స్యకారుల బృందం సముద్రంలో వెటకు వెళ్లారు. కచ్చతీవు, నెడుంతీవు భారతీయ మత్స్యకారులకు చేపల వేటకు అనుమతి ఉండటంతో.. ఆ సమీపంలోకి వెళ్లారు. సోమవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న శ్రీలంక నేవీ.. బోట్లు అంతర్జాతీయ సరిహద్దులను దాటి శ్రీలంక పరిపాలనలో ఉన్న ప్రాంతంలో చేపలు పట్టినందుకు అరెస్టు చేశారు. ఈ ఘటనపై రామనాథపురం, తూత్తుకుడి తదితర ప్రాంతాల్లోని మత్స్యకార సంఘాలు మండిపడుతున్నారు.
Gidugu Rudraraju: మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. మోడీ రాజీనామా చేయాలి
పట్టుబడిన మత్స్యకారులు మండపం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అందులో సురేష్, ఆరుముగం, మణికందన్, కుమార్ మరియు వట్టన్వలసాయి ప్రాంతానికి చెందిన జయశీలన్, ముత్తు, పోరియన్, నల్లతంబి, వెల్మురుగన్లు ఉన్నారు. శ్రీలంక నావికాదళం మొదట సముద్రంలో వారిని ప్రశ్నించి ఆపై అరెస్టు చేసింది. ఆ తర్వాత వారిని శ్రీలంకలోని స్థానిక కోర్టులో హాజరుపరచగా, వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత.. భారత మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం ఆగ్రహం చల్లారిపోతుందని మత్స్యకార వర్గాలు అనుకున్నాయి. ఇద్దరు ప్రధానుల సమావేశం అనంతరం 15 మంది మత్స్యకారులను శ్రీలంకలోని మల్లాడి జైలు నుంచి విడుదల చేశారు. మరోవైపు తమిళనాడులోని మత్స్యకార సంఘం ప్రతినిధి మాట్లాడుతూ.. కేంద్రం జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలనీ, తమ వర్గానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మత్స్యకారులపై కేసు నమోదు చేయకుండా వెంటనే విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్లు విధించేలా చట్టం
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!