Fishermen Arrest: తమిళనాడుకు చెందిన 9 మంది జాలర్లు అరెస్ట్.. ఆగ్రహంతో మత్స్యకార సంఘాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడుకు చెందిన 9 మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం అదుపులోకి తీసుకుంది. సముద్ర సరిహద్దును ఉల్లంఘించినందుకు అరెస్ట్ చేశారని రాష్ట్ర మత్స్యశాఖ అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. వారివద్ద నుంచి రెండు మెకనైజ్డ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. రామనాథపురం జిల్లాలోని మండపానికి చెందిన మత్స్యకారులు సోమవారం ఉదయం చేపల వేటకు వెళ్లగా నిన్న అర్థరాత్రి కచ్చతీవు- నెడుంతీవు మధ్య వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు వారిని అరెస్ట్ చేయడంపై మత్స్యకార సంఘాలు మండిపడుతున్నాయి.
Minister Roja: సమ్మక్క- సారక్క రీ యూనియన్.. కన్నుల పండుగగా ఉందే
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
సోమవారం ఉదయం మండపం ప్రాంతం నుంచి 200కు పైగా పడవల్లో మత్స్యకారుల బృందం సముద్రంలో వెటకు వెళ్లారు. కచ్చతీవు, నెడుంతీవు భారతీయ మత్స్యకారులకు చేపల వేటకు అనుమతి ఉండటంతో.. ఆ సమీపంలోకి వెళ్లారు. సోమవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న శ్రీలంక నేవీ.. బోట్లు అంతర్జాతీయ సరిహద్దులను దాటి శ్రీలంక పరిపాలనలో ఉన్న ప్రాంతంలో చేపలు పట్టినందుకు అరెస్టు చేశారు. ఈ ఘటనపై రామనాథపురం, తూత్తుకుడి తదితర ప్రాంతాల్లోని మత్స్యకార సంఘాలు మండిపడుతున్నారు.
Gidugu Rudraraju: మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. మోడీ రాజీనామా చేయాలి
పట్టుబడిన మత్స్యకారులు మండపం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అందులో సురేష్, ఆరుముగం, మణికందన్, కుమార్ మరియు వట్టన్వలసాయి ప్రాంతానికి చెందిన జయశీలన్, ముత్తు, పోరియన్, నల్లతంబి, వెల్మురుగన్లు ఉన్నారు. శ్రీలంక నావికాదళం మొదట సముద్రంలో వారిని ప్రశ్నించి ఆపై అరెస్టు చేసింది. ఆ తర్వాత వారిని శ్రీలంకలోని స్థానిక కోర్టులో హాజరుపరచగా, వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత.. భారత మత్స్యకారులపై శ్రీలంక నావికాదళం ఆగ్రహం చల్లారిపోతుందని మత్స్యకార వర్గాలు అనుకున్నాయి. ఇద్దరు ప్రధానుల సమావేశం అనంతరం 15 మంది మత్స్యకారులను శ్రీలంకలోని మల్లాడి జైలు నుంచి విడుదల చేశారు. మరోవైపు తమిళనాడులోని మత్స్యకార సంఘం ప్రతినిధి మాట్లాడుతూ.. కేంద్రం జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలనీ, తమ వర్గానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. మత్స్యకారులపై కేసు నమోదు చేయకుండా వెంటనే విడుదల చేయాలని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!