IPL 2023: లక్నోతో అమీతుమీకి సిద్ధమైన సన్ రైజర్స్ హైదరాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ గేమ్ కు రెడీ అయింది. ఇవాళ సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా కీలకంగా మారింది. సొంత గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అవమానకర రీతిలో ఏకంగా 72 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఆ మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్ర్కమ్ తో పాటు క్లాసెన్, యాన్సెన్ లు బరిలోకి దిగలేదు. ప్రధాన ప్లేయర్లు లేరు కాబట్టే సన్ రైజర్స్ ఓడిందంటూ అటు ఫ్యాన్స్.. ఇటు మేనేజ్మెంట్ సర్థి చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ముగ్గురు ప్లేయర్స్ జట్టుతో కలిశారు.
Also Read : Banking Service Charges Increased : షాకింగ్ న్యూస్.. సర్వీస్ చార్జీలు భారీగా పెంచిన బ్యాంకులు
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
దాంతో లక్నోతో జరిగే పోరు సన్ రైజర్స్ కు అత్యంత కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్ కు ముందు కెప్టెన్ మార్క్రమ్ కు కొత్త సమస్య తయారైంది. అదే ప్లేయింగ్ ఎలెవన్.. ముఖ్యంగా విదేశీ ప్లేయర్ల విషయంలో ఎవర్నీ ఆడించాలి అనే అంశంపై మార్క్రమ్ తల బద్దలు కొట్టుకుంటున్నాడు. ఐపీఎల్ రూల్ ప్రకారం.. నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే తుది జట్టులో ఆడాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో విదేశీ ప్లేయర్ల కోటాలో హ్యారీ బ్రూక్, గ్లేన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, ఫరూఖీలు ఆడారు. అయితే ఇప్పుడు సౌతాఫ్రికా త్రయం జట్టుతో చేరడంతో ఆ నలుగురు విదేశీ ప్లేయర్లు ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Also Read : IPL 2023: దుమ్మురేపిన శార్థుల్.. స్పిన్ దెబ్బకు కుదేలైన ఆర్సీబీ
కెప్టెన్ హోదాలో మార్క్రమ్ తుది జట్టులో ఉండటం ఖాయం. భారీ మొత్తం చెల్లించిన బ్రూక్ కూడా తుది జట్టులో ఉంటాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆదిల్ రషీద్ మంచి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. దాంతో స్పిన్నర్ గా అతడు కొనసాగే అవకాశం ఉంది. లక్నో పిచ్ సీమర్లకి అనుకూలిస్తుందనుకుంటే మాత్రం రషీద్ స్థానంలో యాన్సెన్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. రషీద్, యాన్సెన్, ఫరూఖీలలో ఇద్దరు బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇక వికెట్ కీపర్ గా గ్లెన్ ఫిలిప్స్ ను కొనసాగిస్తారా లేక హెన్రిచ్ క్లాసెన్ ను ఆడిస్తారో చూడాలి.. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే క్లాసెన్ కు అవకాశం ఇవ్వడం మంచిది. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ లో విఫలమైంది. లక్నోతో జరిగే మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ కానుంది.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!