IPL 2023: లక్నోతో అమీతుమీకి సిద్ధమైన సన్ రైజర్స్ హైదరాబాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ బిగ్ గేమ్ కు రెడీ అయింది. ఇవాళ సాయంత్రం లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు చాలా కీలకంగా మారింది. సొంత గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అవమానకర రీతిలో ఏకంగా 72 పరుగుల తేడాతో ఓడింది. అయితే ఆ మ్యాచ్ లో రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్ర్కమ్ తో పాటు క్లాసెన్, యాన్సెన్ లు బరిలోకి దిగలేదు. ప్రధాన ప్లేయర్లు లేరు కాబట్టే సన్ రైజర్స్ ఓడిందంటూ అటు ఫ్యాన్స్.. ఇటు మేనేజ్మెంట్ సర్థి చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ముగ్గురు ప్లేయర్స్ జట్టుతో కలిశారు.
Also Read : Banking Service Charges Increased : షాకింగ్ న్యూస్.. సర్వీస్ చార్జీలు భారీగా పెంచిన బ్యాంకులు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
దాంతో లక్నోతో జరిగే పోరు సన్ రైజర్స్ కు అత్యంత కీలకంగా మారింది. ఇక ఈ మ్యాచ్ కు ముందు కెప్టెన్ మార్క్రమ్ కు కొత్త సమస్య తయారైంది. అదే ప్లేయింగ్ ఎలెవన్.. ముఖ్యంగా విదేశీ ప్లేయర్ల విషయంలో ఎవర్నీ ఆడించాలి అనే అంశంపై మార్క్రమ్ తల బద్దలు కొట్టుకుంటున్నాడు. ఐపీఎల్ రూల్ ప్రకారం.. నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే తుది జట్టులో ఆడాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన పోరులో విదేశీ ప్లేయర్ల కోటాలో హ్యారీ బ్రూక్, గ్లేన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, ఫరూఖీలు ఆడారు. అయితే ఇప్పుడు సౌతాఫ్రికా త్రయం జట్టుతో చేరడంతో ఆ నలుగురు విదేశీ ప్లేయర్లు ఎవరనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
Also Read : IPL 2023: దుమ్మురేపిన శార్థుల్.. స్పిన్ దెబ్బకు కుదేలైన ఆర్సీబీ
కెప్టెన్ హోదాలో మార్క్రమ్ తుది జట్టులో ఉండటం ఖాయం. భారీ మొత్తం చెల్లించిన బ్రూక్ కూడా తుది జట్టులో ఉంటాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆదిల్ రషీద్ మంచి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. దాంతో స్పిన్నర్ గా అతడు కొనసాగే అవకాశం ఉంది. లక్నో పిచ్ సీమర్లకి అనుకూలిస్తుందనుకుంటే మాత్రం రషీద్ స్థానంలో యాన్సెన్ కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. రషీద్, యాన్సెన్, ఫరూఖీలలో ఇద్దరు బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇక వికెట్ కీపర్ గా గ్లెన్ ఫిలిప్స్ ను కొనసాగిస్తారా లేక హెన్రిచ్ క్లాసెన్ ను ఆడిస్తారో చూడాలి.. ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే క్లాసెన్ కు అవకాశం ఇవ్వడం మంచిది. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ లో విఫలమైంది. లక్నోతో జరిగే మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ కానుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..