Spices Price: ఘాటెక్కిన మసాలా.. నెలలో 42% ఎగిసిన పసుపు.. 3రెట్లు పెరిగిన జీలకర్ర రేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spices Price: ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ధరల భారాన్ని మోస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశం నుంచి దిగిరావడం లేదు. పండ్లు ముట్టుకుందామన్నా ధరల షాక్ తగులుతుంది. ఇంతలోనే మసాలల ధరల ఘాటు నషాళానికి ఎక్కుతుంది. వాటి ధర అనేక రెట్లు పెరిగింది. దీంతో సామాన్యుల కిచెన్ బడ్జెట్ తలకిందులైపోయింది. విశేషమేమిటంటే సుగంధ ద్రవ్యాలలో జీలకర్ర అత్యంత ఖరీదైనది. దీని ధర అనేక రెట్లు పెరిగింది. దీంతో పప్పు దినుసుల్లో జీలకర్ర మాయమైపోయింది. రానున్న రోజుల్లో మసాలా దినుసులు మరింత ప్రియం అయ్యే అవకాశం ఉందని వ్యాపారులు, దుకాణదారులు చెబుతున్నారు.
అయితే జీలకర్రతో పాటు మెంతులు, ఎండు యాలకులు, కారం, పసుపు, కొత్తిమీర కూడా చాలా ఖరీదయ్యాయి. కొన్ని నెలల క్రితం వరకు మార్కెట్లో జీలకర్ర కిలో రూ.200 ఉండేది. ఇప్పుడు దాని ధర కిలో రూ.700 దాటింది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో కిలో జీలకర్ర ధర రూ.700 నుంచి రూ.720కి పెరిగింది. రానున్న రోజుల్లో జీలకర్ర ధర మరింత పెరిగే అవకాశం ఉందని దుకాణదారులు చెబుతున్నారు. కొత్త పంట వచ్చిన తర్వాతే ధరలు తగ్గుతాయంటున్నారు.
Also Read
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
- Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
Read Also:Yusuf Pathan Fifty: యూసఫ్ పఠాన్ విధ్వంసం.. 14 బంతుల్లోనే 61 రన్స్! చుక్కలు చూసిన పాక్ బ్యాటర్
13ఏళ్ల గరిష్టానికి పసుపు ధర
అదేవిధంగా పసుపు కూడా చాలా ఖరీదైనదిగా మారింది. దీని ధర 13 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. విశేషమేమిటంటే.. నెల రోజుల్లోనే పసుపు ధరలో 42 శాతం పెరుగుదల నమోదైంది. దాని ధర మూడు నెలల్లో 76 శాతం పెరిగింది. మహారాష్ట్రలోని హింగోలిలోని కురుంద మార్కెట్లో పసుపు క్వింటాల్కు రూ.12 వేలకు విక్రయిస్తున్నారు. అయితే దీని ధర కొన్ని నెలల క్రితం వరకు క్వింటాల్ రూ.10 వేల లోపే ఉండేది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో పసుపు ధర రూ.150 వరకు ఉంది. కాగా, గతంలో కిలో రూ.70 నుంచి 80 వరకు విక్రయించేవారు.
రూ.100పెరిగిన యాలకుల ధర
ఎర్ర మిరపకాయలు రిటైల్ మార్కెట్లో చాలా ఖరీదైనవిగా మారాయి. దీని ధర కూడా దాదాపు రెట్టింపైంది. ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో కిలో రూ.150కి లభించే ఎర్రమిర్చి ఇప్పుడు కిలో రూ.280కి అమ్ముడుపోతోంది. అదేవిధంగా అజ్వైన్, మెంతికూర, లవంగం, యాలకులు కూడా ఖరీదైనవిగా మారాయి. కిలో రూ.150 ఉన్న ఆకుకూరల ధర రూ.220కి పెరిగింది. పెసరపప్పు ధర కూడా రూ.20 పెరిగింది. ఇప్పుడు కిలో రూ.120కి విక్రయిస్తున్నారు. అదేవిధంగా లవంగం ధర కూడా కిలో రూ.900కి పెరిగింది. పెద్ద ఏలకులు కిలోకు 1200 రూపాయలకు విక్రయించబడుతోంది, అంతకుముందు రూ.1000కే లభించేవి.
Read Also:India And Japan: ఇండో-పసిఫిక్లో యథాతథ స్థితే కొనసాగింపు: జపాన్
సుగంధ ద్రవ్యాలు ధర (6 నెలల క్రితం) ప్రస్తుత ధర (కేజీలో)
జీలకర్ర 365 725
పసుపు 120 180
సోపు 250 500
ఏలకులు 1000 1300
రెడ్ చిల్లీ 150 280
పెద్ద ఏలకులు 1000 1200
తాజావార్తలు
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
-
Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
-
Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్.. అదరగొట్టిన చిరు.. ఆదుకున్న సమంత
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆందోళన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!