Trains Cancelled: తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్యాన్సిల్ చేసింది. విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో మెయింటనెన్స్ వర్క్స్ దృష్ట్యా పలు ట్రైన్స్ ను అధికారులు రద్దు చేశారు. ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసి మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు తెలిపారు.
Read Also: Ameesha Patel : గదర్ 2 లో అలాంటి సన్నివేశం లేదు.. దయచేసి అలాంటి వీడియో వైరల్ చేయకండి…
Also Read
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
విజయవాడ-బిట్రగుంట ట్రైన్ను 16వ తేదీ నుంచి 22 వరకు క్యాన్సిల్ చేయగా.. బిట్రగుంట-విజయవాడ, బిట్రగుంట-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-బిట్రగుంట, రాజమండ్రి-విశాఖపట్నం, విశాఖపట్నం-రాజమండ్రి, కాకినాడ పోర్ట్-విశాఖపట్నం, విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-విజయవాడ, విశాఖపట్నం-కాకినాడ పోర్ట్, విజయవాడ-గూడూరు రైళ్లను 17 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. గూడురు-విజయవాడ ట్రైన్ను 18 నుంచి 24 వరకు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్ అధికారులు పేర్కొంది.
Read Also: TTD EO Dharmareddy: శ్రీవాణి ట్రస్ట్కు ఇప్పటివరకు రూ.880 కోట్ల విరాళాలు
ఇక, నర్సాపూర్-గుంటూరు, గుంటూరు-నర్సాపూర్ ట్రైన్ను ఈ నెల 17 నుంచి 23వ తారీఖు వరకు విజయవాడ-గుంటూరు మధ్య పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు. ధన్బాద్-అల్లెప్పి రైలును 18, 21, 22వ తేదీలలో, హటియా-బెంగళూరు రైలును 18న, టాటా-బెంగళూరు 21న, హటియా-బెంగళూరు రైళ్లను 22న నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు. అటు హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పనుల కారణంగా తెలంగాణలోని పలు రైళ్లను ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. దీంతో, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!