Somu Veerraju: ఓట్ల కోసమే కోనసీమలో అలజడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కోనసీమ అల్లర్లు హాట్ టాపిక్ అవుతోంది. అల్లర్లు జరిగి వారం అవుతున్నా ఇంకా అక్కడ అలజడి చల్లారలేదు. అంబేద్కర్ పేరుని చాలా చోట్ల పెట్టినా.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఎందుకు గొడవలు జరిగాయి..? బీజేపీ 42 చోట్ల అంబేద్కర్ పేరు పెట్టినా గొడవలు రాలేదు.. కోనసీమలో ఎందుకు గొడవలు జరిగాయి..? అని ప్రశ్నించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
కేవలం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయంలో భాగంగానే కోనసీమలో గొడవలు జరిగాయి.కొన్ని వర్గాలను కావాలనే రెచ్చగొడుతున్నారు. మంత్రి ఇల్లు తగులబెడితే హోం మంత్రి, డీజీపీ వెళ్లి పరిశీలించరా..? కోనసీమ ఘటనపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకోదా..? రిటైర్డ్ జడ్జీతో కోనసీమ విధ్వంసంపై ఎందుకు విచారణ జరపరు..? అన్నారు.
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
కోనసీమ మొత్తం వెంటనే ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించాలి. గోదావరి గర్జన పేరుతో రాజమండ్రిలో ఈ నెల 7వ తేదీన నడ్డా ముఖ్య అతిథిగా బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమం కంటే.. నరేంద్ర మోడీ ఇచ్చే సంక్షేమమే ఎక్కువ. నవ రత్నాలు ఎక్కువ..? నరేంద్ర మోడీ ఎక్కువ..? మోడీ పాలనలోనే అభివృద్ధి ఉంది.. రాష్ట్రంలో అభివృద్ధి లేదని విమర్శించారు.
కేంద్రంలో అవినీతి లేదు.. రాష్ట్రంలో ఎక్కడా చూసినా అవినీతే.అనేక వర్గాలకు సంక్షేమం అందేలా కేంద్రం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది.నరేగా, ఈ-శ్రామ్ కార్డులు, జన్ ధన్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, ఆత్మ నిర్బర్ భారత్ వంటి ఎన్నో పథకాల ద్వారా ఎంతో లబ్ది చేకూరుస్తున్నాం.గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇళ్లు 20 లక్షలైతే.. కట్టినవి మాత్రం కేవలం 40 వేలు మాత్రమే.రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సరిగా ఇవ్వకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
సర్పంచులకు కేంద్రం నేరుగా నిధులు వేస్తోంటే.. ఆ నిధులనూ సీఎం మళ్లిస్తున్నారు.ఆత్మకూరులో మేం పోటీ చేస్తున్నాం.మేమే రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం. బద్వేలులో జనసేన మద్దతిచ్చింది.. ఆత్మకూరులో జనసేన మద్దతు విషయమై చర్చిస్తున్నాం అని తెలిపారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!