Somu Veerraju: ఓట్ల కోసమే కోనసీమలో అలజడి
ఏపీలో కోనసీమ అల్లర్లు హాట్ టాపిక్ అవుతోంది. అల్లర్లు జరిగి వారం అవుతున్నా ఇంకా అక్కడ అలజడి చల్లారలేదు. అంబేద్కర్ పేరుని చాలా చోట్ల పెట్టినా.. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే ఎందుకు గొడవలు జరిగాయి..? బీజేపీ 42 చోట్ల అంబేద్కర్ పేరు పెట్టినా గొడవలు రాలేదు.. కోనసీమలో ఎందుకు గొడవలు జరిగాయి..? అని ప్రశ్నించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
కేవలం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయంలో భాగంగానే కోనసీమలో గొడవలు జరిగాయి.కొన్ని వర్గాలను కావాలనే రెచ్చగొడుతున్నారు. మంత్రి ఇల్లు తగులబెడితే హోం మంత్రి, డీజీపీ వెళ్లి పరిశీలించరా..? కోనసీమ ఘటనపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకోదా..? రిటైర్డ్ జడ్జీతో కోనసీమ విధ్వంసంపై ఎందుకు విచారణ జరపరు..? అన్నారు.
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
కోనసీమ మొత్తం వెంటనే ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించాలి. గోదావరి గర్జన పేరుతో రాజమండ్రిలో ఈ నెల 7వ తేదీన నడ్డా ముఖ్య అతిథిగా బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమం కంటే.. నరేంద్ర మోడీ ఇచ్చే సంక్షేమమే ఎక్కువ. నవ రత్నాలు ఎక్కువ..? నరేంద్ర మోడీ ఎక్కువ..? మోడీ పాలనలోనే అభివృద్ధి ఉంది.. రాష్ట్రంలో అభివృద్ధి లేదని విమర్శించారు.
కేంద్రంలో అవినీతి లేదు.. రాష్ట్రంలో ఎక్కడా చూసినా అవినీతే.అనేక వర్గాలకు సంక్షేమం అందేలా కేంద్రం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది.నరేగా, ఈ-శ్రామ్ కార్డులు, జన్ ధన్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, ఆత్మ నిర్బర్ భారత్ వంటి ఎన్నో పథకాల ద్వారా ఎంతో లబ్ది చేకూరుస్తున్నాం.గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఇళ్లు 20 లక్షలైతే.. కట్టినవి మాత్రం కేవలం 40 వేలు మాత్రమే.రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు సరిగా ఇవ్వకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
సర్పంచులకు కేంద్రం నేరుగా నిధులు వేస్తోంటే.. ఆ నిధులనూ సీఎం మళ్లిస్తున్నారు.ఆత్మకూరులో మేం పోటీ చేస్తున్నాం.మేమే రాష్ట్రంలో నిజమైన ప్రతిపక్షం. బద్వేలులో జనసేన మద్దతిచ్చింది.. ఆత్మకూరులో జనసేన మద్దతు విషయమై చర్చిస్తున్నాం అని తెలిపారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
-
Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
-
Aadarsha-kutumbam: వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’లో వీరమల్లు బ్యూటీ..
-
Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
-
Riyan Parag: వరుస వివాదాల్లో రాజస్థాన్ రాయల్స్.. డ్రెస్సింగ్ రూమ్లో రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ కెప్టెన్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో