Somireddy Chandramohan Reddy : పవర్ సెక్టారులో స్కాంల సీక్వెల్ను ప్రభుత్వం తెర లేపింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ రంగంలో జగన్ ప్రభుత్వం భారీ స్కాంలకు పాల్పడుతోందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవర్ సెక్టారులో స్కాంల సీక్వెలును ప్రభుత్వం తెర లేపిందన్నారు. పవర్ స్కాంలని పార్టులు పార్టులుగా బయట పెడతామని ఆయన వ్యాఖ్యానించారు. రూ. 7 వేల కోట్ల స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని మేం బయటపెట్టామని, స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై హైకోర్టులో పిల్ వేశాను.. త్వరలో విచారణకు రాబోతోందన్నారు. అరబిందో.. షిర్డీ సాయి అనేవి జగనుకు దత్తపుత్రులు అని, ఈ రెండు సంస్థలకు పుట్టిన విష పుత్రిక ఇండో సోల్ సంస్థ అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘ఇండోసోల్ ప్రాజెక్టుకు సోలార్ ప్రాజెక్టులు కట్టబెడుతున్నారు. విద్యుత్ రంగంలో భారీ ఎత్తున ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణం జరిగింది. వివిధ కెపాసిటీలతో ఉన్న ఒక్కో ట్రాన్సఫార్మరులోనే రూ. 1 లక్ష నుంచి రూ. 8 లక్షల వరకు దోపిడీ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ట్రాన్సఫార్మర్ల కంటే చాలా అధిక మొత్తంలో ఏపీలో ధరలు ఉన్నాయి. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో దాదాపు 62 శాతం మేర ఆర్డర్లు షిర్టీ సాయి సంస్థకే వెళ్తున్నాయి. షిర్టీ సాయి సంస్థకు నాసిరకం ట్రాన్సఫార్మర్ల సరఫరా చేస్తోందనే అంశంపై గత ప్రభుత్వం పెనాల్టీ విధించింది. గత ప్రభుత్వం విధించిన ఆ పెనాల్టీని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. పెనాల్టీ రద్దు వెనుక మరో స్కాం ఉంది.
పవర్ స్కాం పార్ట్-2లో మరిన్ని వివరాలు బయటపెడతా. దీన్ని వదిలి పెట్టేదే లేదు.. స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. ప్రతి ఒక్కరూ ఆధారపడే విద్యుత్ రంగంలో భారీ దోపిడీనా..? ఈ స్కాంల వల్లే పేదలపై విద్యుత్ భారం.’ అని సోమిరెడ్డి విమర్శలు గుప్పించారు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!