Smriti Mandhana: నా ఫేవరేట్ క్రికెటర్ అతడే: స్మృతి మంధాన
- ఫేవరేట్ బ్యాటర్ విరాట్ కోహ్లీ
- అప్పటునుంచి మైండ్సెట్ మారిపోయింది
- మంధాన టీ20 ప్రపంచకప్కు స్మృతి సన్నద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Mandhana About Virat Kohli: టీమిండియా మహిళా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తనకు ఫేవరేట్ బ్యాటర్ అని తెలిపారు. తాజాగా స్టార్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోహ్లీని తాను కలిశానని, అతడి నుంచి కొన్ని సూచనలు తీసుకున్నానని వెల్లడించారు. కోహ్లీ, స్మృతిలు ఐపీఎల్ ఆర్సీబీకి ఆడుతున్న విషయం తెలిసిందే. టీమిండియా స్టార్స్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మలను కాదని కోహ్లీని స్మృతి మంధాన ఎంచుకున్నారు.
తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో స్మృతి మంధాన పాల్గొనగా.. ఫేవరేట్ క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. ‘విరాట్ కోహ్లీ నా ఫేవరేట్ క్రికెటర్. కోహ్లీని నేను కలిసినపుడు అతడి బ్యాటింగ్, మైండ్ సెట్ గురించి అడిగాను. బ్యాటింగ్కు వెళ్లినప్పుడు ఏమి ఆలోచిస్తారు?, మీపై ఉండే ఒత్తిడిని ఎలా అధిగమిస్తారు? అని అడిగా. అంచనాల గురించి అస్సలు పట్టించుకోనని, జట్టుకు ఏం కావాలో దాని గురించే ఆలోచిస్తానని విరాట్ నాతొ చెప్పాడు. అది విన్న తర్వాత నా మైండ్సెట్ పూర్తిగా మారిపోయింది’ అని స్మృతి చెప్పుకొచ్చారు.
Also Read
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
Also Read: BSNL 5G Network: బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్పై కీలక అప్డేట్!
ప్రస్తుతం స్మృతి మంధాన టీ20 ప్రపంచకప్కు సిద్దమవుతున్నారు. రేపటి నుంచి ఎన్సీఏలో భారత జట్టు 10 రోజుల శిక్షణ శిబిరం మొదలుకానుంది. యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో తలపడనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడుతుంది. అక్టోబర్ 6న పాకిస్థాన్తో, అక్టోబర్ 9న శ్రీలంకతో, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. గ్రూప్ దశలో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీస్ ఆడతాయి.
తాజావార్తలు
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!