Ajmer Sex Scandal Case: 100 మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..నిందితులకు జీవిత ఖైదు
- దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్.. జ్మీర్ బ్లాక్ మెయిల్ కేసు
- ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు
- రూ.5 లక్షల జరిమానా
- అజ్మీర్లోని ప్రత్యేక కోర్టు తీర్పు
- 32 ఏళ్ల నిరీక్షణకు తెర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్, అజ్మీర్ బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది. అంతేకాకుండా వారికి రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు. అజ్మీర్లోని ప్రత్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ 32 ఏళ్ల సెక్స్ స్కాండల్లో నఫీస్ చిస్తీ, సలీం చిస్తీ, ఇక్బాల్ భాటి, నసీమ్ సయ్యద్, జమీర్ హుస్సేన్, సోహిల్ ఘనీలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ లైంగిక కుంభకోణంలో మొత్తం 18 మంది నిందితులు ఉండగా.. వారిలో తొమ్మిది మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి. మిగిలిన తొమ్మిది మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. ఒకరు పరారీలో ఉన్నారు. ఒకరిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.
READ MORE: Ponnam Prabhakar: కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే.. కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తుండు..
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
1992లో వందమందికి పైగా కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం చేసి వారి నగ్న ఫొటోలను ప్రసారం చేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ. 1992లో స్కూల్, కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. గతంలో తొమ్మిది మంది నిందితులపై తీర్పు వెలువరించింది. నిందితులు పదేళ్ల జైలు శిక్ష అనుభవించి, పూర్తి చేసిన తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. ఒక నిందితుడు అల్మాస్ మహరాజ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత ఓ నిందితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కాకుండా 377 కేసుల్లో ఒక నిందితుడిపై ప్రత్యేక కేసు నడుస్తోంది.
READ MORE:Ponguleti Srinivasa Reddy: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం..
మొత్తం విషయం ఏమిటి?
అజ్మీర్లో అప్పటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ, అతని సహచరుడు నఫీస్, అనుచరులు కాలేజీ అమ్మాయిలను వేటాడేవారు. ఫామ్హౌస్లు, రెస్టారెంట్లలో పార్టీల పేరుతో అమ్మాయిలను పిలిచి మత్తు మందు తాగించి, సామూహిక అత్యాచారం చేశారు. వారి నగ్న ఛాయాచిత్రాలు తీయించేవారు. ఆ తర్వాత నిందితులు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ వేరే అమ్మాయిలను తమ వెంట తీసుకురావాలని ఒత్తిడి తెచ్చేవారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?