Ajmer Sex Scandal Case: 100 మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..నిందితులకు జీవిత ఖైదు
- దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్.. జ్మీర్ బ్లాక్ మెయిల్ కేసు
- ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు
- రూ.5 లక్షల జరిమానా
- అజ్మీర్లోని ప్రత్యేక కోర్టు తీర్పు
- 32 ఏళ్ల నిరీక్షణకు తెర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్, అజ్మీర్ బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది. అంతేకాకుండా వారికి రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు. అజ్మీర్లోని ప్రత్యేక కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ 32 ఏళ్ల సెక్స్ స్కాండల్లో నఫీస్ చిస్తీ, సలీం చిస్తీ, ఇక్బాల్ భాటి, నసీమ్ సయ్యద్, జమీర్ హుస్సేన్, సోహిల్ ఘనీలను కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ లైంగిక కుంభకోణంలో మొత్తం 18 మంది నిందితులు ఉండగా.. వారిలో తొమ్మిది మందికి ఇప్పటికే శిక్షలు పడ్డాయి. మిగిలిన తొమ్మిది మంది నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకోగా.. ఒకరు పరారీలో ఉన్నారు. ఒకరిపై ప్రత్యేక విచారణ కొనసాగుతోంది.
READ MORE: Ponnam Prabhakar: కేసీఆర్ ట్యూనింగ్ చేస్తే.. కిషన్ రెడ్డి మ్యూజిక్ ఇస్తుండు..
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
1992లో వందమందికి పైగా కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం చేసి వారి నగ్న ఫొటోలను ప్రసారం చేసిన ఈ కేసులో ప్రధాన నిందితుడు అప్పటి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ. 1992లో స్కూల్, కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. గతంలో తొమ్మిది మంది నిందితులపై తీర్పు వెలువరించింది. నిందితులు పదేళ్ల జైలు శిక్ష అనుభవించి, పూర్తి చేసిన తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. ఒక నిందితుడు అల్మాస్ మహరాజ్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. బెయిల్ వచ్చిన తర్వాత ఓ నిందితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కాకుండా 377 కేసుల్లో ఒక నిందితుడిపై ప్రత్యేక కేసు నడుస్తోంది.
READ MORE:Ponguleti Srinivasa Reddy: వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్లకు పొంగులేటి ఆదేశం..
మొత్తం విషయం ఏమిటి?
అజ్మీర్లో అప్పటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరూక్ చిస్తీ, అతని సహచరుడు నఫీస్, అనుచరులు కాలేజీ అమ్మాయిలను వేటాడేవారు. ఫామ్హౌస్లు, రెస్టారెంట్లలో పార్టీల పేరుతో అమ్మాయిలను పిలిచి మత్తు మందు తాగించి, సామూహిక అత్యాచారం చేశారు. వారి నగ్న ఛాయాచిత్రాలు తీయించేవారు. ఆ తర్వాత నిందితులు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తూ వేరే అమ్మాయిలను తమ వెంట తీసుకురావాలని ఒత్తిడి తెచ్చేవారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!