నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామంలో 2023లో జరిగిన హత్య ఘటనలో జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతుర్ని చంపిన తండ్రికి జీవిత ఖైదు విధించింది. మరో నిందితుడికి రూ.2,000 జరిమానా విధించింది. భార్యపై అనుమానమే హత్యకు కారణమని జిల్లా కోర్టు నిర్ధారించి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తుంటారు.…
దేశంలోనే సంచలనం సృష్టించి సెక్స్ స్కాండల్, అజ్మీర్ బ్లాక్ మెయిల్ కేసులో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు పడింది. అంతేకాకుండా వారికి రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు.
ఇండియాలో అశ్లీల వీడియోలను చూడడం, షేర్ చేయడం లేదా డౌన్లోడ్ చేసుకోవడం నేరం. తాజాగా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్ కుంద్రా కేసుపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త, సెలెబ్రిటీ అయిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్ ను ఈనెల 23 వరకు రిమాండ్ కు తరలించాల్సిందిగా కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుంద్రాపై భారత శిక్షాస్మృతిలోని 420 (మోసం), 34 (సాధారణ ఉద్దేశం),…