Sita Mandir: బీహార్ లో సీతా మందిర్.. రాజకీయాల కోసమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sita Mandir Construction in Bihar: ప్రజల మనసు దోచకోవడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రామ మందిరంతో హిందువులకు దగ్గరైన బీజేపీ తరహాలోనే సీతా మందిర్ కట్టి వారికి దగ్గరవ్వాలని జేడీయూ భావిస్తున్నట్లు ఉంది. దీని కోసం సీతా దేవి జన్మించినట్లు చెబుతున్న సీతామర్హి జిల్లాలోని పునారా ధామ్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీని కోసం మంత్రి వర్గ సమావేశంలో రూ.72.47 కోట్లకు ఆమోదం తెలిపారు.
సీతామర్హి జిల్లా పునౌర ధామ్ ఆలయ అభివృద్ధి పథకం కింద ‘సీతా వాటిక’, ‘లవ్-కుష్ వాటిక’, కెఫెటేరియా, ల్యాండ్స్కేపింగ్ రోడ్డు తదితర నిర్మాణాలు చేపడతామని చెప్పారు. అయితే దీని వల్ల అయినా జేడీయూ మళ్లీ అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి. దీని గురించి బీహార్ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ రాముడిలాగా సీతా మాత జన్మస్థలాన్ని అభివృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుందన్నారు.
Also Read
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
Also Read: G20 Summit: భారత్ బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఢిల్లీ వీధుల్లో తిరగనున్న ‘ది బీస్ట్’!
ఇక నితీశ్ కుమార్ అందరి కోసం ఈ పనిచేశారని జేడీయూ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ అన్నారు. పునారా ధామ్ అభివృద్ధి పథకానికి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. బీజేపీ గుడి, మసీదులపై రాజకీయాలు చేసి మత ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఇక దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ మహాకూటమికి సీతామందిర్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ఇంత వరుకు ఈ విషయాన్ని పట్టించుకోని వారు ఇప్పుడే ఎందుకు తెరపైకి తెచ్చారో ప్రజలందరికి తెలుసన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిందని, పునారా ధామ్ను అభివృద్ధి చేయాలని నితీశ్ కుమార్ చాలాసార్లు మాట్లాడారని, ఇప్పటి వరకు ఏమీ జరగలేదన్నారు రాకేష్ కుమార్.ఇక ఈసారి అయినా సీతా మందిరాన్ని నితీశ్ పూర్తి చేస్తారో లేదో చూడాలి.
- Tags
- bihar
- bjp
- construction
- JD(U)
- Sita Mandir
తాజావార్తలు
-
IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
-
NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
-
Laikey Laikaa: రాషా థడానీ ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ ఆగిపోలేదు.. వాలెంటైన్స్ డేకు వస్తోంది..
-
China: వేలాది కుటుంబాల కన్నీటి వేదన..నిజాలను సమాధి చేసే పాలన.. చైనా నిజస్వరూపం ఇదే!
-
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!