G20 Summit: భారత్ బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఢిల్లీ వీధుల్లో తిరగనున్న ‘ది బీస్ట్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US President Joe Biden leaves for India to attend G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ బయలుదేరారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి తన ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్లో బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. భారత్ ప్రయాణంకు ముందు బైడెన్కు కరోనా వైరస్ టెస్ట్ చేయగా.. ఇందులో ఆయనకు నెగెటివ్ వచ్చింది.
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొనబోతున్నారు. బైడెన్ నేటి సాయంత్రం ఢిల్లీకి రానుండగా.. ఆయన వాడే కాడిలాక్ కారు, ది బీస్ట్ కూడా హస్తినకు చేరుకోనున్నాయి. ది బీస్ట్ కారును బోయింగ్ సీ 17 గ్లోబ్ మాస్టర్ 111 కార్గో విమానం తీసుకొస్తుంది. విమానం దిగిన వెంటనే బీస్ట్ కారులో బయలుదేరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బైడెన్ కలుస్తారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన కారుగా పేరున్న ‘ది బీస్ట్’ ఢిల్లీ వీధుల్లో తిరగనుంది. దీనికి అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు సెక్యూరిటీ ఇస్తారు.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
Also Read: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే?
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జో బిడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆపై ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. ఇక శనివారం, ఆదివారం జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో వీరు పాల్గొంటారు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బైడెన్కు వసతి కల్పించారు. ఈ హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బిడెన్తో పాటు జీ20 దేశాల అధినేతలు, ప్రతినిధులు ఢిల్లీకి వస్తుంటడంతో.. కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేసింది.
#WATCH | Washington DC: US President Joe Biden departs for India to attend the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10.
(Source: Reuters) pic.twitter.com/MHCyU6ZDKI
— ANI (@ANI) September 7, 2023
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!