G20 Summit: భారత్ బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఢిల్లీ వీధుల్లో తిరగనున్న ‘ది బీస్ట్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US President Joe Biden leaves for India to attend G20 Summit: జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ బయలుదేరారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నుంచి తన ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్లో బయలుదేరారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. భారత్ ప్రయాణంకు ముందు బైడెన్కు కరోనా వైరస్ టెస్ట్ చేయగా.. ఇందులో ఆయనకు నెగెటివ్ వచ్చింది.
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాల్గొనబోతున్నారు. బైడెన్ నేటి సాయంత్రం ఢిల్లీకి రానుండగా.. ఆయన వాడే కాడిలాక్ కారు, ది బీస్ట్ కూడా హస్తినకు చేరుకోనున్నాయి. ది బీస్ట్ కారును బోయింగ్ సీ 17 గ్లోబ్ మాస్టర్ 111 కార్గో విమానం తీసుకొస్తుంది. విమానం దిగిన వెంటనే బీస్ట్ కారులో బయలుదేరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బైడెన్ కలుస్తారు. దాంతో ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన కారుగా పేరున్న ‘ది బీస్ట్’ ఢిల్లీ వీధుల్లో తిరగనుంది. దీనికి అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు సెక్యూరిటీ ఇస్తారు.
Also Read
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
Also Read: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే?
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జో బిడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆపై ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. ఇక శనివారం, ఆదివారం జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో వీరు పాల్గొంటారు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్యలో బైడెన్కు వసతి కల్పించారు. ఈ హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బిడెన్తో పాటు జీ20 దేశాల అధినేతలు, ప్రతినిధులు ఢిల్లీకి వస్తుంటడంతో.. కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేసింది.
#WATCH | Washington DC: US President Joe Biden departs for India to attend the G20 Summit, scheduled to be held in Delhi from September 9 to 10.
(Source: Reuters) pic.twitter.com/MHCyU6ZDKI
— ANI (@ANI) September 7, 2023
తాజావార్తలు
-
Telangana Sports : గాయత్రి-త్రిసాకు సీఎం రేవంత్ అభినందనలు.. గోపీచంద్తో స్పెషల్ మీట్
-
Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Hyderabad Pan Masala Raid: హైదరాబాద్లో పాన్ మసాలా దందా.. రూ.160 కోట్ల స్కామ్..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!