Raksha Bandhan: గుండెపోటుతో అన్న మృతి.. మృతదేహానికి రాఖీ కట్టిన చెల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raksha Bandhan: ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కవ అవుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుని ప్రాణాలు విడుస్తున్నారు. మృతుల్లో చిన్నారులు ఉండడం బాధ కలిగించే విషయం. అప్పటి వరకు తోటి విద్యార్థులతో ఆడుకుంటున్న చిన్నారులు గుండెపోటుకు గురై క్షణాల్లో మృత్యువాత పడుతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుతో చనిపోతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇవాళ రాఖీ పండుగ సందర్బంగా దేశమంతా అన్నా చెల్లెల్లు రాఖీ పండుగ చేసుకుంటుంటే ఓ చెల్లికి గుండె పగిలే విషాదం ఎదురైంది. అన్న చనిపోవడంతో గుండెలవిసేలా రోధిస్తూ చనిపోయిన సోదరుడికి రాఖీ కట్టడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 26 వరకు ట్రైన్ల కుదింపు
Also Read
- Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. "నిఘా"పై పెంటగాన్ హెచ్చరిక..
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకు చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లె గౌరమ్మ మంగళవారం పుట్టింటికి వచ్చింది. ప్రతి సంవత్సరం లాగానే చాలా రోజుల తర్వాత అక్క ఇంటికి రావడంతో అన్నా కూడా సంతోషించాడు. అప్పటి వరకు చెల్లెలితో సంతోషంగానే ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆనందంగా చెల్లితో మాట్లాడుతుండగా కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే కనకయ్య గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యలకు ఏం జరుగుతుందో అస్సలు అర్థంకానీ పరిస్థితి ఎదురైంది. కనకయ్యను ఏమైందంటూ తట్టినా ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో కుటుంసభ్యులు షాక్ తిన్నారు. కనకయ్య మృతి చెందినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మనతో వున్న కొడుకు ఒక్కసారిగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎంతో సంతోషంతో అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలికి అన్నయ్య మృతితో తీవ్ర విషాదం మిగిలింది. చివరగా అన్నయ్య మృతదేహానికి సోదరి గౌరమ్మ రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది. ఇదే చివరి రాఖీ అంటూ విలపించింది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనురాగాన్ని చూసిన వాళ్లంతా కంటతడి పెట్టారు. ఏ సోదరికీ ఇలాంటి కష్టాలు రాకూడదని గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Uttar Pradesh: హిందూమతంపై కామెంట్స్.. “ఆ నేత నాలుక కోసేస్తే రూ. 10 లక్షల రివార్డ్”..
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!