Simhachalam Temple: వీడని అప్పన్న చందనోత్సవం వివాదం.. భక్తుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం సింహాచలం దేవస్థానం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఏర్పడిన చందనోత్సవం వివాదం ఇంకా వీడలేదు. దేవస్థానం అధికారుల వైఫల్యాలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతరాలయ దర్శనాలు 10 వేలని చెప్పి 20 వేలకు పైగా టిక్కెట్లు జారీచేశారు. పరిమితికి మించి VVIP టిక్కెట్ల జారీతో లేని సమస్యలు తెచ్చిపెట్టుకుంది ఉత్సవ కమిటీ. సమన్వయం లోపంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వేలాదిమంది భక్తులు.. ఘాట్ రోడ్ జామ్, గంటలకొద్దీ దర్శన సమయం, కనీస వసతుల కల్పించక పోవడంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలకు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీలు.

దేవస్థానం అధికారులపై మంత్రి ఆగ్రహం
Also Read
- AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
- Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
- Trinamool Congress: చీలిక దిశగా మమత పార్టీ.. 50 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై..!
- DK.Shivakumar: రేపే సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణం.. కేబినెట్లో వీరికి బెర్త్ కన్ఫాం!
సింహాచలం చందనోత్సవంలో భక్తుల ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వీవీఐపీ టిక్కెట్లు కొనుగోలు చేసిన గంటల తరబడి క్యూ లైనల్లో ఉండిపోవడంపై భక్తులు మండిపడ్డారు. EO డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. టైం స్లాట్ విధానం ఫెయిల్ అయిందని అప్పన్న స్వామి భక్తులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం ఘోర వైఫల్యం చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భక్తులు బారిగేడ్లు విరగ్గొట్టారు. సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్న మంత్రి కొట్టు సత్యన్నారాయణకు భక్తుల నుంచి నిరసన సెగ ఎదురుకాక తప్పలేదు. క్యూ లైనల్లోనే భక్తులు నిరసనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది.
Read Also: Astrology: ఏప్రిల్ 24, సోమవారం దినఫలాలు
భక్తులు నిరసన సెగలతో దేవాదాయమంత్రి కొట్టు సత్యనారాయణ పోలీస్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చందనోత్సవం నిర్వహణపై విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన ఏర్పాట్లు ఎప్పుడు చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఆలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది అని ఆయన అన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గర్భాలయంలో ఆచారాలు మంటగలిపి ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు.. ఈరోజు దర్శనానికి ఎందుకు వచ్చానా అనే బాధ కలుగుతుంది అని విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. పేదల దేవుడి దగ్గర గందరగోళం సృష్టించారు..ఇటు విపక్షాలు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్సవ కమిటీ-దేవస్థాన కమిటీ మధ్య వివాదం వల్లే ఈ వైఫల్యం తలెత్తిందని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏం నివేదిక ఇస్తుందో… ఎవరిని బాధ్యులుగా చేస్తుందో చూడాలి.
Read Also: Shooting at Texas : హైస్కూల్ ప్రాం పార్టీలో ఫైరింగ్.. 9 మందికి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు
-
Ponnam Prabhakar : తెలంగాణ మా అయ్యా జాగిరే.. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
-
Buchibabu : ‘మ్యూజిక్’ అనడమే రాని స్థితి నుండి.. రెహమాన్ పక్కన కూర్చునే వరకు!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Trinamool Congress: చీలిక దిశగా మమత పార్టీ.. 50 మంది ఎమ్మెల్యేలు గుడ్ బై..!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!