Simhachalam Temple: వీడని అప్పన్న చందనోత్సవం వివాదం.. భక్తుల ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నం సింహాచలం దేవస్థానం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఏర్పడిన చందనోత్సవం వివాదం ఇంకా వీడలేదు. దేవస్థానం అధికారుల వైఫల్యాలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంతరాలయ దర్శనాలు 10 వేలని చెప్పి 20 వేలకు పైగా టిక్కెట్లు జారీచేశారు. పరిమితికి మించి VVIP టిక్కెట్ల జారీతో లేని సమస్యలు తెచ్చిపెట్టుకుంది ఉత్సవ కమిటీ. సమన్వయం లోపంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు వేలాదిమంది భక్తులు.. ఘాట్ రోడ్ జామ్, గంటలకొద్దీ దర్శన సమయం, కనీస వసతుల కల్పించక పోవడంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలకు పిలుపునిచ్చాయి రాజకీయ పార్టీలు.

దేవస్థానం అధికారులపై మంత్రి ఆగ్రహం
Also Read
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
సింహాచలం చందనోత్సవంలో భక్తుల ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వీవీఐపీ టిక్కెట్లు కొనుగోలు చేసిన గంటల తరబడి క్యూ లైనల్లో ఉండిపోవడంపై భక్తులు మండిపడ్డారు. EO డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. టైం స్లాట్ విధానం ఫెయిల్ అయిందని అప్పన్న స్వామి భక్తులు మండిపడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం ఘోర వైఫల్యం చెందిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భక్తులు బారిగేడ్లు విరగ్గొట్టారు. సింహాచలం అప్పన్న స్వామి దర్శనానికి వెళ్తున్న మంత్రి కొట్టు సత్యన్నారాయణకు భక్తుల నుంచి నిరసన సెగ ఎదురుకాక తప్పలేదు. క్యూ లైనల్లోనే భక్తులు నిరసనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది.
Read Also: Astrology: ఏప్రిల్ 24, సోమవారం దినఫలాలు
భక్తులు నిరసన సెగలతో దేవాదాయమంత్రి కొట్టు సత్యనారాయణ పోలీస్ లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చందనోత్సవం నిర్వహణపై విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ఘోరమైన ఏర్పాట్లు ఎప్పుడు చూడలేదు అంటూ వ్యాఖ్యానించారు. ఆలయంలో పోలీసులు జులుం ఎక్కువైంది అని ఆయన అన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గర్భాలయంలో ఆచారాలు మంటగలిపి ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు.. ఈరోజు దర్శనానికి ఎందుకు వచ్చానా అనే బాధ కలుగుతుంది అని విశాఖ శ్రీశారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. పేదల దేవుడి దగ్గర గందరగోళం సృష్టించారు..ఇటు విపక్షాలు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉత్సవ కమిటీ-దేవస్థాన కమిటీ మధ్య వివాదం వల్లే ఈ వైఫల్యం తలెత్తిందని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏం నివేదిక ఇస్తుందో… ఎవరిని బాధ్యులుగా చేస్తుందో చూడాలి.
Read Also: Shooting at Texas : హైస్కూల్ ప్రాం పార్టీలో ఫైరింగ్.. 9 మందికి తీవ్ర గాయాలు
తాజావార్తలు
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!