Financial Problems: చదువుల తల్లికి ఆర్థిక పరిస్థితులే అడ్డంకి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Financial Problems: చదువుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఉన్నత చదువులు చదివి అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యమవుతుంది. అందుకు కుటుంబ నేపధ్యం, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండి తీరాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో తన ఆశయం, తన కల నెరవేరదేమో అని ఆందోళన చెందుతుంది ఓ అమ్మాయి. వివరాల్లోకి వెళితే… సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లికి చెందిన గొర్రెల కాపరి స్వామి, బీడీ కార్మికురాలు నాగమణి ముగ్గురు కుమార్తెలలో రెండో కూతురు స్రవంతి చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉంటూ చదువుకుంటుంది. చిన్నప్పటి నుంచి పేదరికం ఎంతగా వెనక్కి లాగినా.. అన్ని పరీక్షల్లోనూ కష్టపడి అధిక మార్కులు సాధిస్తూ వచ్చింది. 10వ తరగతితో పాటు డిప్లొమా వరకు చదువులో అగ్రస్థానంలో నిలిచింది. హార్టికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (HORTICET-2022) కోసం కూడా అదే పంథాలో కొనసాగింది. రాష్ట్రంలో మూడో ర్యాంక్ సాధించింది.
రాష్ట్రంలోనే మూడో ర్యాంక్ సాధించినా కూడా మరో రెండు రోజుల్లో రూ.50 వేలు చెల్లిస్తే తప్ప తాను అడ్మిషన్ను పొందలేని పరిస్థితి దాపురించింది. వీరి చిన్న ఇల్లు తప్ప మరో ఆధారం లేదు. తల్లిదండ్రులు ఇప్పటివరకు ముగ్గురు కూతుళ్లకు రెక్కలు ముక్కలు చేసుకుని ఎలాగోలా ఫీజును చెల్లించగలిగారు. ముగ్గురు కూతుళ్లూ చదువులో తమ ప్రతిభను కనబరిచారు. ఇప్పటివరకైనా ఎలాగోలా నెట్టుకొచ్చారు కానీ ఉన్నత విద్య కోసం వెచ్చించే స్థోమత లేక ఆందోళన చెందుతున్నారు. పెద్ద కూతురు కళ్యాణి 2020లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసింది, కానీ ఆర్థిక సహాయం లేకపోవడంతో చదువు కొనసాగించలేకపోయింది. కళ్యాణి ఇప్పుడు ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని, ఉద్యోగం సంపాదించి జీవనోపాధి పొందాలనే ఆశతో ఎదురుచూస్తోంది.
Also Read
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
Metro Rail: శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోరైలు విషయంలో కీలక పరిణామం
ఆదిలాబాద్లోని హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో హార్టికల్చర్లో డిప్లొమా పూర్తి చేసిన స్రవంతి అక్కడ కూడా 9.3 జీపీఏ సాధించి టాప్లో నిలిచింది. ఆమె 10వ తరగతిలో కూడా 10 జీపీఏ సాధించింది. ఇప్పుడు హార్టిసెట్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించి, నవంబర్ చివరలో ఫలితాలు ప్రకటించబడిన తర్వాత ముందుకు సాగడం చాలా కష్టంగా మారింది. నాలుగేళ్లపాటు ప్రతి ఏటా రూ.లక్ష చెల్లించాల్సి ఉండగా, డిసెంబరు 5న కౌన్సెలింగ్ జరగనున్నందున రూ.50,000 చెల్లించి అడ్మిషన్ను నిర్ధారించుకోవడం సవాలుగా మారింది. ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త పులి రాజు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్రవంతికి మద్దతు ఇవ్వాలని పలువురిని ఆయన కోరుతున్నారు. అయితే తమ పిల్లల చదువు కోసం ఎవరైనా సాయం చేయాలని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!