Financial Problems: చదువుల తల్లికి ఆర్థిక పరిస్థితులే అడ్డంకి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Financial Problems: చదువుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఉన్నత చదువులు చదివి అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యమవుతుంది. అందుకు కుటుంబ నేపధ్యం, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండి తీరాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడంతో తన ఆశయం, తన కల నెరవేరదేమో అని ఆందోళన చెందుతుంది ఓ అమ్మాయి. వివరాల్లోకి వెళితే… సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లికి చెందిన గొర్రెల కాపరి స్వామి, బీడీ కార్మికురాలు నాగమణి ముగ్గురు కుమార్తెలలో రెండో కూతురు స్రవంతి చిన్నప్పటి నుండి చదువులో చురుకుగా ఉంటూ చదువుకుంటుంది. చిన్నప్పటి నుంచి పేదరికం ఎంతగా వెనక్కి లాగినా.. అన్ని పరీక్షల్లోనూ కష్టపడి అధిక మార్కులు సాధిస్తూ వచ్చింది. 10వ తరగతితో పాటు డిప్లొమా వరకు చదువులో అగ్రస్థానంలో నిలిచింది. హార్టికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (HORTICET-2022) కోసం కూడా అదే పంథాలో కొనసాగింది. రాష్ట్రంలో మూడో ర్యాంక్ సాధించింది.
రాష్ట్రంలోనే మూడో ర్యాంక్ సాధించినా కూడా మరో రెండు రోజుల్లో రూ.50 వేలు చెల్లిస్తే తప్ప తాను అడ్మిషన్ను పొందలేని పరిస్థితి దాపురించింది. వీరి చిన్న ఇల్లు తప్ప మరో ఆధారం లేదు. తల్లిదండ్రులు ఇప్పటివరకు ముగ్గురు కూతుళ్లకు రెక్కలు ముక్కలు చేసుకుని ఎలాగోలా ఫీజును చెల్లించగలిగారు. ముగ్గురు కూతుళ్లూ చదువులో తమ ప్రతిభను కనబరిచారు. ఇప్పటివరకైనా ఎలాగోలా నెట్టుకొచ్చారు కానీ ఉన్నత విద్య కోసం వెచ్చించే స్థోమత లేక ఆందోళన చెందుతున్నారు. పెద్ద కూతురు కళ్యాణి 2020లో అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసింది, కానీ ఆర్థిక సహాయం లేకపోవడంతో చదువు కొనసాగించలేకపోయింది. కళ్యాణి ఇప్పుడు ప్రభుత్వం వ్యవసాయ విస్తరణాధికారులకు నోటిఫికేషన్ విడుదల చేస్తుందని, ఉద్యోగం సంపాదించి జీవనోపాధి పొందాలనే ఆశతో ఎదురుచూస్తోంది.
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
Metro Rail: శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రోరైలు విషయంలో కీలక పరిణామం
ఆదిలాబాద్లోని హార్టికల్చర్ డిప్లొమా కాలేజీలో హార్టికల్చర్లో డిప్లొమా పూర్తి చేసిన స్రవంతి అక్కడ కూడా 9.3 జీపీఏ సాధించి టాప్లో నిలిచింది. ఆమె 10వ తరగతిలో కూడా 10 జీపీఏ సాధించింది. ఇప్పుడు హార్టిసెట్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించి, నవంబర్ చివరలో ఫలితాలు ప్రకటించబడిన తర్వాత ముందుకు సాగడం చాలా కష్టంగా మారింది. నాలుగేళ్లపాటు ప్రతి ఏటా రూ.లక్ష చెల్లించాల్సి ఉండగా, డిసెంబరు 5న కౌన్సెలింగ్ జరగనున్నందున రూ.50,000 చెల్లించి అడ్మిషన్ను నిర్ధారించుకోవడం సవాలుగా మారింది. ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త పులి రాజు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్రవంతికి మద్దతు ఇవ్వాలని పలువురిని ఆయన కోరుతున్నారు. అయితే తమ పిల్లల చదువు కోసం ఎవరైనా సాయం చేయాలని ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!