IPL 2025: మొదటి మ్యాచ్లోనే చరిత్ర సృష్టించనున్న శ్రేయాస్ అయ్యర్..!
- కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్ కింగ్స్
- పంజాబ్ జట్టుకు కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్
- చరిత్ర సృష్టించనున్న శ్రేయాస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ కింగ్స్ తమ జట్టుకు కొత్త కెప్టెన్ను ఆదివారం ప్రకటించింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ జట్టుకు కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్కి కెప్టెన్సీ చేస్తే భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించనున్నాడు. రెండు కంటే ఎక్కువ జట్లకు కెప్టెన్గా వ్యవహరించిన తొలి భారత కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. ఇప్పటి వరకు ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అయితే ఆ ఇద్దరు క్రికెటర్లు విదేశీయులే. తొలిసారిగా మూడు జట్లకు సారథ్యం వహించిన అవకాశం భారతీయుడికి దక్కింది.
Read Also: Jayam Ravi: నన్ను ఇక అలా పిలవద్దు.. పండుగ నాడు జయం రవి కీలక ప్రకటన
Also Read
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. మొహాలీకి చెందిన ఫ్రాంచైజీ రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. శ్రేయాస్ కెప్టెన్సీలో 2024లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలిపాడు. అయితే.. 18 సీజన్లలో శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు 17వ కెప్టెన్.. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు కెప్టెన్లను మార్చినంతగా మరే జట్టు మార్చలేదు.
Read Also: Breaking: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మందికి తీవ్ర గాయాలు
ఐపీఎల్లో మూడు జట్లకు సారథ్యం వహించిన తొలి భారత ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. శ్రేయాస్ అయ్యర్ 2018 సీజన్ మధ్య నుండి 2020 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్నాడు. అతను జట్టును ఒక సీజన్లో ఫైనల్స్కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2022, 2024 లో KKR కెప్టెన్గా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లతో ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఏకైక కెప్టెన్ కూడా ఇతనే.. శ్రేయాస్ కంటే ముందు మూడు జట్లకు మహేల జయవర్ధనే, స్టీవ్ స్మిత్ సారథ్యం వహించారు. జయవర్ధనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, ఢిల్లీ డేర్డెవిల్స్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. స్మిత్ పూణే వారియర్స్ ఇండియా, రైజింగ్ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్లకు కెప్టెన్గా ఉన్నాడు.
తాజావార్తలు
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
-
Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
-
Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
-
Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
-
Earphones: రోజూ ఇయర్ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..