IPL 2025: మొదటి మ్యాచ్లోనే చరిత్ర సృష్టించనున్న శ్రేయాస్ అయ్యర్..!
- కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్ కింగ్స్
- పంజాబ్ జట్టుకు కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్
- చరిత్ర సృష్టించనున్న శ్రేయాస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ కింగ్స్ తమ జట్టుకు కొత్త కెప్టెన్ను ఆదివారం ప్రకటించింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ జట్టుకు కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్కి కెప్టెన్సీ చేస్తే భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించనున్నాడు. రెండు కంటే ఎక్కువ జట్లకు కెప్టెన్గా వ్యవహరించిన తొలి భారత కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. ఇప్పటి వరకు ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అయితే ఆ ఇద్దరు క్రికెటర్లు విదేశీయులే. తొలిసారిగా మూడు జట్లకు సారథ్యం వహించిన అవకాశం భారతీయుడికి దక్కింది.
Read Also: Jayam Ravi: నన్ను ఇక అలా పిలవద్దు.. పండుగ నాడు జయం రవి కీలక ప్రకటన
Also Read
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. మొహాలీకి చెందిన ఫ్రాంచైజీ రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. శ్రేయాస్ కెప్టెన్సీలో 2024లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలిపాడు. అయితే.. 18 సీజన్లలో శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు 17వ కెప్టెన్.. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు కెప్టెన్లను మార్చినంతగా మరే జట్టు మార్చలేదు.
Read Also: Breaking: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మందికి తీవ్ర గాయాలు
ఐపీఎల్లో మూడు జట్లకు సారథ్యం వహించిన తొలి భారత ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. శ్రేయాస్ అయ్యర్ 2018 సీజన్ మధ్య నుండి 2020 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్నాడు. అతను జట్టును ఒక సీజన్లో ఫైనల్స్కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2022, 2024 లో KKR కెప్టెన్గా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లతో ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఏకైక కెప్టెన్ కూడా ఇతనే.. శ్రేయాస్ కంటే ముందు మూడు జట్లకు మహేల జయవర్ధనే, స్టీవ్ స్మిత్ సారథ్యం వహించారు. జయవర్ధనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, ఢిల్లీ డేర్డెవిల్స్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. స్మిత్ పూణే వారియర్స్ ఇండియా, రైజింగ్ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్లకు కెప్టెన్గా ఉన్నాడు.
తాజావార్తలు
-
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!