Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer: సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో, చివరి టీ20 మ్యాచ్లోనూ భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆఖరి టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్కు ముందు తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గత మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు పడగా, అతని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్ పర్యటనలో మెరిసిన సూర్యవంశీకి ఈ ఇంగ్లాండ్ టూర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక మరో మార్పుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ శెడ్గే తుది జట్టులోకి వచ్చాడు.
టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మార్పుల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. “సిరీస్ ఫలితం ఎలా ఉన్నా ఆటగాళ్లు తమ వంద శాతం శ్రమను పెట్టాలని కోరుకుంటున్నాను. గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాలను పక్కనపెట్టి, ప్రస్తుత క్షణంలో జీవిస్తూ ప్రశాంతంగా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించడమే ముఖ్యం. జట్టు భవిష్యత్తుకు ఏది మంచిదనే కోణంలోనే వాషింగ్టన్ స్థానంలో సూర్యాంశ్, సూర్యవంశీ స్థానంలో సంజు శామ్సన్లను జట్టులోకి తీసుకున్నాం” అని అయ్యర్ వివరించారు.
Also Read
- US Visa Rules 2026: అమెరికా వీసాకు ఇక రూ.17 లక్షల బాండ్.. భారతీయులకు భారీ ఊరట.. పూర్తి వివరాలు ఇవే
- TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. టీటీడీ చరిత్రలోనే మొదటిసారి!
- 120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
- Amrapali Dubey: "పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనుకుంటున్నాను".. అమ్రపాలి షాకింగ్ స్టేట్మెంట్
అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు ఇంగ్లాండ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. సామ్ కరన్, ఆదిల్ రషీద్ల అద్భుత బౌలింగ్ ధాటికి భారత్ 56 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను ఇంగ్లాండ్ 4-0తో క్లీన్స్వీప్ చేసింది (తొలి మ్యాచ్ వర్షార్పణమైంది). డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియాను ఇంగ్లాండ్ అన్ని రంగాల్లోనూ చిత్తు చేసింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇప్పటివరకు భారత్కు కనీసం ఒక్క విజయం కూడా దక్కకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
US Visa Rules 2026: అమెరికా వీసాకు ఇక రూ.17 లక్షల బాండ్.. భారతీయులకు భారీ ఊరట.. పూర్తి వివరాలు ఇవే
-
TTD Record: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. టీటీడీ చరిత్రలోనే మొదటిసారి!
-
Lung Cancer: వంటగదిలో క్యాన్సర్ ముప్పు… మహిళలను నిండా ముంచుతున్న సంప్రదాయవాదులు ఆలోచనలు!
-
Lady Super Star : రీజనల్ సినిమాలకు స్వస్తి.. ఇకపై పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలే
-
RBI New FD Rules: ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టే వారికి కీలక సమాచారం.. RBI కొత్త నిబంధనలతో ఏం మారుతుంది?
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!