Shreyas Iyer: “అందుకే జట్టు నుంచి వైభవ్ సూర్యవంశీని తీసేశాం”.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer: సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో, చివరి టీ20 మ్యాచ్లోనూ భారత్ ఘోర పరాజయం చవిచూసింది. ఆఖరి టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్కు ముందు తుది జట్టులో రెండు కీలక మార్పులు చేసింది. గత మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు పడగా, అతని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శామ్సన్ జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్ పర్యటనలో మెరిసిన సూర్యవంశీకి ఈ ఇంగ్లాండ్ టూర్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇక మరో మార్పుగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ శెడ్గే తుది జట్టులోకి వచ్చాడు.
టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ మార్పుల గురించి మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ ప్రయోగాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. “సిరీస్ ఫలితం ఎలా ఉన్నా ఆటగాళ్లు తమ వంద శాతం శ్రమను పెట్టాలని కోరుకుంటున్నాను. గతంలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాలను పక్కనపెట్టి, ప్రస్తుత క్షణంలో జీవిస్తూ ప్రశాంతంగా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించడమే ముఖ్యం. జట్టు భవిష్యత్తుకు ఏది మంచిదనే కోణంలోనే వాషింగ్టన్ స్థానంలో సూర్యాంశ్, సూర్యవంశీ స్థానంలో సంజు శామ్సన్లను జట్టులోకి తీసుకున్నాం” అని అయ్యర్ వివరించారు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
అయితే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు ఇంగ్లాండ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. సామ్ కరన్, ఆదిల్ రషీద్ల అద్భుత బౌలింగ్ ధాటికి భారత్ 56 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను ఇంగ్లాండ్ 4-0తో క్లీన్స్వీప్ చేసింది (తొలి మ్యాచ్ వర్షార్పణమైంది). డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియాను ఇంగ్లాండ్ అన్ని రంగాల్లోనూ చిత్తు చేసింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఇప్పటివరకు భారత్కు కనీసం ఒక్క విజయం కూడా దక్కకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?