Police on Sharddha Walker Case: శ్రద్ధ 2020లో తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది.. అందుకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police on Sharddha Walker Case: 2020లో శ్రద్ధా వాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు ప్రారంభించామని, అయితే కేసును ఉపసంహరించుకోవాలని ఆమె వ్రాతపూర్వక ప్రకటన ఇవ్వడంతో కేసును మూసివేసినట్లు మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెలిపారు. తనకు, అఫ్తాబ్ పూనావాలాకు మధ్య వివాదం పరిష్కరించబడిందని శ్రద్ధా వాకర్ కేసు వెనక్కి తీసుకుందని పోలీసులు వెల్లడించారు. ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ సమయంలో పోలీసులు చేశారు. ఫిర్యాదుదారు ఇచ్చిన దరఖాస్తును కూడా విచారించారు. విచారణ అనంతరం ఎలాంటి వివాదం లేదని ఫిర్యాదుదారు స్వయంగా రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. ఆమె స్నేహితుడి తల్లిదండ్రులు కూడా వివాదాన్ని పరిష్కరించడానికి ఆమెను పిలిచారు. ఆమె వ్రాతపూర్వక స్టేట్మెంట్ ఇచ్చిందని.. ఆ తర్వాత కేసు మూసివేయబడిందని డీసీపీ బావ్చే చెప్పారు.
శ్రద్దా వాకర్ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా 35 ముక్కలుగా నరికి హత్య చేశాడు. రిఫ్రిజిరేటర్లో దాచి మరీ ఆమె శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశాడు. 2020లో మహారాష్ట్రలోని పాల్ఘర్లోని తులిన్జ్ పోలీస్ స్టేషన్లో శ్రద్ధా ఫిర్యాదు చేసిందని, అందులో అఫ్తాబ్ పూనావాలా తనను కొట్టాడని, చంపేస్తానని బెదిరించాడని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. నవంబర్ 23, 2020న తులింజ్ పోలీస్ స్టేషన్కు శ్రద్ధ ఫిర్యాదు లేఖ రాసినట్లు ధృవీకరించారు. అఫ్తాబ్ తనను చంపేస్తానని బెదిరించాడని, పోలీసుల దగ్గరకు వెళ్లే ధైర్యం తనకు లేదని శ్రద్ధా ఫిర్యాదు లేఖలో పేర్కొంది. అయితే, తాను లేఖ రాస్తున్న రోజే అఫ్తాబ్ తనను చంపేందుకు ప్రయత్నించాడని, ముక్కలు ముక్కలుగా నరికి విసిరేస్తానని బెదిరించాడని ఆమె పేర్కొంది. అఫ్తాబ్ తనను కొట్టాడని, చంపడానికి ప్రయత్నించాడని అఫ్తాబ్ తల్లిదండ్రులకు తెలుసునని లేఖలో పేర్కొన్నారు. తడి కుటుంబసభ్యులు ఉన్నారనే ధైర్యంతో తనతో ఉన్నానని.. కానీ వారికి తెలిసే తనను బాధపెట్టినట్లు ఆమె లేఖలో తెలిపింది. తనతో కలిసి ఉండాలని లేదని కూడా ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయినప్పటికీ… మళ్లీ అతనితోనే ఆమె ఎందుకు ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
Bombay Highcourt: మైనరే కానీ ఆమెకు అన్నీ తెలుసు.. అత్యాచార నిందితుడికి బెయిల్
ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో అఫ్తాబ్ను మంగళవారం దేశ రాజధానిలోని సాకేత్ కోర్టులో హాజరుపరిచారు. జరిగిన విషయం గురించి అని అఫ్తాబ్ కోర్టుకు చెప్పాడు. అఫ్తాబ్పై న్యాయస్థానం అనుమతించిన పాలిగ్రాఫ్ పరీక్ష నిన్న ప్రారంభించబడింది. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) అసిస్టెంట్ డైరెక్టర్ రోహిణి, సంజీవ్ గుప్తా మాట్లాడుతూ.. ఆఫ్తాబ్పై పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే ప్రక్రియ ప్రారంభమైందని, వారం రోజుల్లో నివేదిక వెలువడుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!