Police on Sharddha Walker Case: శ్రద్ధ 2020లో తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది.. అందుకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police on Sharddha Walker Case: 2020లో శ్రద్ధా వాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు ప్రారంభించామని, అయితే కేసును ఉపసంహరించుకోవాలని ఆమె వ్రాతపూర్వక ప్రకటన ఇవ్వడంతో కేసును మూసివేసినట్లు మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెలిపారు. తనకు, అఫ్తాబ్ పూనావాలాకు మధ్య వివాదం పరిష్కరించబడిందని శ్రద్ధా వాకర్ కేసు వెనక్కి తీసుకుందని పోలీసులు వెల్లడించారు. ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ సమయంలో పోలీసులు చేశారు. ఫిర్యాదుదారు ఇచ్చిన దరఖాస్తును కూడా విచారించారు. విచారణ అనంతరం ఎలాంటి వివాదం లేదని ఫిర్యాదుదారు స్వయంగా రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. ఆమె స్నేహితుడి తల్లిదండ్రులు కూడా వివాదాన్ని పరిష్కరించడానికి ఆమెను పిలిచారు. ఆమె వ్రాతపూర్వక స్టేట్మెంట్ ఇచ్చిందని.. ఆ తర్వాత కేసు మూసివేయబడిందని డీసీపీ బావ్చే చెప్పారు.
శ్రద్దా వాకర్ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా 35 ముక్కలుగా నరికి హత్య చేశాడు. రిఫ్రిజిరేటర్లో దాచి మరీ ఆమె శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశాడు. 2020లో మహారాష్ట్రలోని పాల్ఘర్లోని తులిన్జ్ పోలీస్ స్టేషన్లో శ్రద్ధా ఫిర్యాదు చేసిందని, అందులో అఫ్తాబ్ పూనావాలా తనను కొట్టాడని, చంపేస్తానని బెదిరించాడని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. నవంబర్ 23, 2020న తులింజ్ పోలీస్ స్టేషన్కు శ్రద్ధ ఫిర్యాదు లేఖ రాసినట్లు ధృవీకరించారు. అఫ్తాబ్ తనను చంపేస్తానని బెదిరించాడని, పోలీసుల దగ్గరకు వెళ్లే ధైర్యం తనకు లేదని శ్రద్ధా ఫిర్యాదు లేఖలో పేర్కొంది. అయితే, తాను లేఖ రాస్తున్న రోజే అఫ్తాబ్ తనను చంపేందుకు ప్రయత్నించాడని, ముక్కలు ముక్కలుగా నరికి విసిరేస్తానని బెదిరించాడని ఆమె పేర్కొంది. అఫ్తాబ్ తనను కొట్టాడని, చంపడానికి ప్రయత్నించాడని అఫ్తాబ్ తల్లిదండ్రులకు తెలుసునని లేఖలో పేర్కొన్నారు. తడి కుటుంబసభ్యులు ఉన్నారనే ధైర్యంతో తనతో ఉన్నానని.. కానీ వారికి తెలిసే తనను బాధపెట్టినట్లు ఆమె లేఖలో తెలిపింది. తనతో కలిసి ఉండాలని లేదని కూడా ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయినప్పటికీ… మళ్లీ అతనితోనే ఆమె ఎందుకు ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
- Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి - పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
Bombay Highcourt: మైనరే కానీ ఆమెకు అన్నీ తెలుసు.. అత్యాచార నిందితుడికి బెయిల్
ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో అఫ్తాబ్ను మంగళవారం దేశ రాజధానిలోని సాకేత్ కోర్టులో హాజరుపరిచారు. జరిగిన విషయం గురించి అని అఫ్తాబ్ కోర్టుకు చెప్పాడు. అఫ్తాబ్పై న్యాయస్థానం అనుమతించిన పాలిగ్రాఫ్ పరీక్ష నిన్న ప్రారంభించబడింది. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) అసిస్టెంట్ డైరెక్టర్ రోహిణి, సంజీవ్ గుప్తా మాట్లాడుతూ.. ఆఫ్తాబ్పై పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే ప్రక్రియ ప్రారంభమైందని, వారం రోజుల్లో నివేదిక వెలువడుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..