Karnataka : తమ్ముడిని చంపి తప్పించుకుందాం అనుకున్నాడు.. కుంభమేళాక పోయివచ్చి దొరికిపోయాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka : డబ్బు, మహిళ, భూమి అనే మూడింటి కోసం ప్రతి మనిషి ఏదైనా చేస్తాడని అంటుంటారు. అది కూడా నిజమే. కర్ణాటక నుండి ఈ మూడు విషయాలకు సంబంధిన ఓ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి తన తమ్ముడిని హత్య చేయించి ఏమాత్రం అనుమానం రాకుండా తప్పించుకుందాం అనుకున్నాడు. తన తమ్ముడిని హత్య చేసేందుకు కొంత మందికి కాంట్రాక్ట్ ఇచ్చాడు. హత్యతో సంబంధం లేదని నిరూపించుకునేందుకు ప్రయాగరాజ్ వెళ్లాడు. కానీ పాపం నిజం బహిరంగం అయిపోవడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఈ సంఘటన ఫిబ్రవరి 11న జరిగింది. అక్కడ కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూర్ తాలూకాలో 45 ఏళ్ల రైతు కృష్ణ గౌడ దారుణ హత్యకు గురయ్యాడు. హత్యపై దర్యాప్తు చేయగా ఒక షాకింగ్ విషయం బయటపడింది. కృష్ణ గౌడ.. అన్నయ్య అయిన శివనంజే గౌడే నిందితుడని తేలింది. తన సోదరుడిని చంపడానికి శివనంజే గౌడ రూ.5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడని దర్యాప్తులో తేలింది. పోలీసులు హత్యకు కారణం భూ వివాదామే అని తేల్చేశారు.
Also Read
- Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
- West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
Read Also:Summer Fruits: వేసవిలో తినాల్సిన ఫ్రూట్స్ ఇవే!
వివరాల్లోకి వెళితే కృష్ణ గౌడకు చాలా అప్పులు ఉన్నాయి. దీంతో అతడి అన్న శివనంజే గౌడ వాటిని తిరిగి చెల్లించినట్లు పోలీసు అధికారి తెలిపారు. ప్రతిగా కృష్ణగౌడ తన ఆస్తిని తన అన్నయ్య భార్య పేరు మీద బదిలీ చేయాల్సి వచ్చింది. కానీ కృష్ణగౌడ ఆ ఆస్తిని ఇవ్వడానికి నిరాకరించి కోర్టులో కేసు వేశాడు. అంతేకాకుండా, అతను శివనంజే గౌడ భార్య గురించి కూడా చెడుగా ప్రచారం చేశాడు. ఇది శివనంజే గౌడకు కోపం తెప్పించింది. దీంతో తన తమ్ముడిని చంపడానికి చంద్రశేఖర్, సునీల్, ఉల్లాస్, ప్రతాప్, అభిషేక్, శ్రీనివాస్, హనుమనేగౌడలకు రూ.5 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చాడు. వారు కృష్ణ గౌడను అతి దారుణంగా హత మార్చారు.
నిందితులను విచారించినప్పుడు శివంజయ్ గౌడ పాత్ర కూడా ఇందులో ఉందని పోలీసులకు తెలిసింది. హత్యకు ఒక రోజు ముందు శివనంజే గౌడ ప్రయాగ్రాజ్కు వెళ్లాడని మాండ్య ఎస్పీ మల్లికార్జున బాల దండి తెలిపారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు పుణ్యస్నానాలు చేసేందుకని అందరకీ చెప్పి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే, కాల్ డిటైల్ రికార్డులు (CDR), ఇతర సాంకేతిక ఆధారాలు కృష్ణ హత్యకు కనీసం రెండు నెలలుగా ప్రణాళికలను రచిస్తున్నట్లు చూపించాయి. ఇక ఫైనల్ గా ఫిబ్రవరి 11న కృష్ణ గౌడను హతమార్చారు.
Read Also:MLC Kavitha: తెలంగాణలో కేసీఆర్ను తలవని గుండె లేదు.. ఈ పాలనలో తీవ్ర ఇబ్బందులు
తాజావార్తలు
-
‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్లో లైవ్ కన్సర్ట్ షురూ!
-
Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
-
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!