UP: షాకింగ్.. డబ్బుపై దురాశతో మళ్లీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
- యూపీలోని మధురలో ఓ షాకింగ్ కేసు
- మరోసారి పెళ్లి చేసుకున్న ఓ జంట
- ఇంతకుముందు వారిద్దరికీ పెళ్లి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని మధురలో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఓ జంట మరోసారి పెళ్లి చేసుకుంది. అప్పటికే వారిద్దరికీ పెళ్లి కాగా.. మరోసారి పెళ్లి చేసుకున్నారు. అందుకోసం సామూహిక వివాహ కార్యక్రమానికి వచ్చారు. కాగా.. ఈ విషయం అధికారులకు తెలియగానే వెంటనే అక్కడికి చేరుకుని ఆరా తీశారు. ఈ క్రమంలో.. వారు డబ్బుపై దురాశతో మరోసారి పెళ్లి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా.. వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది.
Read Also: Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?
Also Read
- Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా బీఎస్ఏ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో 142 జంటలకు వివాహాలు జరిగాయి. ఈ జంటలకు రూ.35 వేలు, పెళ్లి ఖర్చుకు ఒక్కో జంటకు రూ.5 వేలు, గృహోపకరణాలకు రూ.10 వేలు అందజేశారు. దీంతోపాటు ఇరువర్గాలకు విందు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుందన్న అత్యాశతో ఓ జంట అక్కడికి చేరుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే.. వారు నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ మొదటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వెడ్డింగ్ కార్డులను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: Priyanka Gandhi: పాలస్తీనాకు ప్రియాంక మద్దతు.. ప్రత్యేక బ్యాగ్తో హల్చల్
శనివారం మధురలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 136 మంది హిందువులు, 06 మంది ముస్లింలు కలిపి 142 మంది యువతీ యువకుల సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఒకే భారీ మంటపం కింద నిర్వహించారు. పండిట్ హిందూ జంటలకు వివాహం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. వివాహ కర్మల ప్రదక్షిణలు, దండలు మార్చుకోవడం నిర్వహించారు. మౌల్వీ ముస్లిం జంటలను తమ వివాహానికి అంగీకరించేలా చేశాడు. రెండు మతాల వివాహాలు ఒకే మంటపం కింద మత సామరస్యంతో జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ వధువుల ఖాతాల్లో 35 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. అదే సమయంలో పెళ్లి నిర్వహణకు ఒక్కో జంటకు రూ.5 వేలు వెచ్చించారు. కాగా దంపతులందరికీ ఒక్కొక్కరికి రూ.10,000 విలువైన గృహోపకరణాలను బహుమతిగా అందజేశారు. చివర్లో అందరికీ విందు కూడా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!