UP: షాకింగ్.. డబ్బుపై దురాశతో మళ్లీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
- యూపీలోని మధురలో ఓ షాకింగ్ కేసు
- మరోసారి పెళ్లి చేసుకున్న ఓ జంట
- ఇంతకుముందు వారిద్దరికీ పెళ్లి.
యూపీలోని మధురలో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఓ జంట మరోసారి పెళ్లి చేసుకుంది. అప్పటికే వారిద్దరికీ పెళ్లి కాగా.. మరోసారి పెళ్లి చేసుకున్నారు. అందుకోసం సామూహిక వివాహ కార్యక్రమానికి వచ్చారు. కాగా.. ఈ విషయం అధికారులకు తెలియగానే వెంటనే అక్కడికి చేరుకుని ఆరా తీశారు. ఈ క్రమంలో.. వారు డబ్బుపై దురాశతో మరోసారి పెళ్లి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా.. వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది.
Read Also: Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?
Also Read
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా బీఎస్ఏ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో 142 జంటలకు వివాహాలు జరిగాయి. ఈ జంటలకు రూ.35 వేలు, పెళ్లి ఖర్చుకు ఒక్కో జంటకు రూ.5 వేలు, గృహోపకరణాలకు రూ.10 వేలు అందజేశారు. దీంతోపాటు ఇరువర్గాలకు విందు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుందన్న అత్యాశతో ఓ జంట అక్కడికి చేరుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే.. వారు నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ మొదటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వెడ్డింగ్ కార్డులను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: Priyanka Gandhi: పాలస్తీనాకు ప్రియాంక మద్దతు.. ప్రత్యేక బ్యాగ్తో హల్చల్
శనివారం మధురలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 136 మంది హిందువులు, 06 మంది ముస్లింలు కలిపి 142 మంది యువతీ యువకుల సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఒకే భారీ మంటపం కింద నిర్వహించారు. పండిట్ హిందూ జంటలకు వివాహం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. వివాహ కర్మల ప్రదక్షిణలు, దండలు మార్చుకోవడం నిర్వహించారు. మౌల్వీ ముస్లిం జంటలను తమ వివాహానికి అంగీకరించేలా చేశాడు. రెండు మతాల వివాహాలు ఒకే మంటపం కింద మత సామరస్యంతో జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ వధువుల ఖాతాల్లో 35 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. అదే సమయంలో పెళ్లి నిర్వహణకు ఒక్కో జంటకు రూ.5 వేలు వెచ్చించారు. కాగా దంపతులందరికీ ఒక్కొక్కరికి రూ.10,000 విలువైన గృహోపకరణాలను బహుమతిగా అందజేశారు. చివర్లో అందరికీ విందు కూడా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
-
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!