UP: షాకింగ్.. డబ్బుపై దురాశతో మళ్లీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
- యూపీలోని మధురలో ఓ షాకింగ్ కేసు
- మరోసారి పెళ్లి చేసుకున్న ఓ జంట
- ఇంతకుముందు వారిద్దరికీ పెళ్లి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని మధురలో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఓ జంట మరోసారి పెళ్లి చేసుకుంది. అప్పటికే వారిద్దరికీ పెళ్లి కాగా.. మరోసారి పెళ్లి చేసుకున్నారు. అందుకోసం సామూహిక వివాహ కార్యక్రమానికి వచ్చారు. కాగా.. ఈ విషయం అధికారులకు తెలియగానే వెంటనే అక్కడికి చేరుకుని ఆరా తీశారు. ఈ క్రమంలో.. వారు డబ్బుపై దురాశతో మరోసారి పెళ్లి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా.. వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది.
Read Also: Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?
Also Read
ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా బీఎస్ఏ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో 142 జంటలకు వివాహాలు జరిగాయి. ఈ జంటలకు రూ.35 వేలు, పెళ్లి ఖర్చుకు ఒక్కో జంటకు రూ.5 వేలు, గృహోపకరణాలకు రూ.10 వేలు అందజేశారు. దీంతోపాటు ఇరువర్గాలకు విందు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుందన్న అత్యాశతో ఓ జంట అక్కడికి చేరుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే.. వారు నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ మొదటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వెడ్డింగ్ కార్డులను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: Priyanka Gandhi: పాలస్తీనాకు ప్రియాంక మద్దతు.. ప్రత్యేక బ్యాగ్తో హల్చల్
శనివారం మధురలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 136 మంది హిందువులు, 06 మంది ముస్లింలు కలిపి 142 మంది యువతీ యువకుల సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఒకే భారీ మంటపం కింద నిర్వహించారు. పండిట్ హిందూ జంటలకు వివాహం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. వివాహ కర్మల ప్రదక్షిణలు, దండలు మార్చుకోవడం నిర్వహించారు. మౌల్వీ ముస్లిం జంటలను తమ వివాహానికి అంగీకరించేలా చేశాడు. రెండు మతాల వివాహాలు ఒకే మంటపం కింద మత సామరస్యంతో జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ వధువుల ఖాతాల్లో 35 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. అదే సమయంలో పెళ్లి నిర్వహణకు ఒక్కో జంటకు రూ.5 వేలు వెచ్చించారు. కాగా దంపతులందరికీ ఒక్కొక్కరికి రూ.10,000 విలువైన గృహోపకరణాలను బహుమతిగా అందజేశారు. చివర్లో అందరికీ విందు కూడా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..