UP: షాకింగ్.. డబ్బుపై దురాశతో మళ్లీ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
- యూపీలోని మధురలో ఓ షాకింగ్ కేసు
- మరోసారి పెళ్లి చేసుకున్న ఓ జంట
- ఇంతకుముందు వారిద్దరికీ పెళ్లి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని మధురలో ఓ షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఓ జంట మరోసారి పెళ్లి చేసుకుంది. అప్పటికే వారిద్దరికీ పెళ్లి కాగా.. మరోసారి పెళ్లి చేసుకున్నారు. అందుకోసం సామూహిక వివాహ కార్యక్రమానికి వచ్చారు. కాగా.. ఈ విషయం అధికారులకు తెలియగానే వెంటనే అక్కడికి చేరుకుని ఆరా తీశారు. ఈ క్రమంలో.. వారు డబ్బుపై దురాశతో మరోసారి పెళ్లి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా.. వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది.
Read Also: Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకల్లో భాగంగా బీఎస్ఏ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో 142 జంటలకు వివాహాలు జరిగాయి. ఈ జంటలకు రూ.35 వేలు, పెళ్లి ఖర్చుకు ఒక్కో జంటకు రూ.5 వేలు, గృహోపకరణాలకు రూ.10 వేలు అందజేశారు. దీంతోపాటు ఇరువర్గాలకు విందు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే.. పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుందన్న అత్యాశతో ఓ జంట అక్కడికి చేరుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే.. వారు నెల రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఈ జంట తమ మొదటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వెడ్డింగ్ కార్డులను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: Priyanka Gandhi: పాలస్తీనాకు ప్రియాంక మద్దతు.. ప్రత్యేక బ్యాగ్తో హల్చల్
శనివారం మధురలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సామూహిక కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద 136 మంది హిందువులు, 06 మంది ముస్లింలు కలిపి 142 మంది యువతీ యువకుల సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఒకే భారీ మంటపం కింద నిర్వహించారు. పండిట్ హిందూ జంటలకు వివాహం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. వివాహ కర్మల ప్రదక్షిణలు, దండలు మార్చుకోవడం నిర్వహించారు. మౌల్వీ ముస్లిం జంటలను తమ వివాహానికి అంగీకరించేలా చేశాడు. రెండు మతాల వివాహాలు ఒకే మంటపం కింద మత సామరస్యంతో జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ వధువుల ఖాతాల్లో 35 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. అదే సమయంలో పెళ్లి నిర్వహణకు ఒక్కో జంటకు రూ.5 వేలు వెచ్చించారు. కాగా దంపతులందరికీ ఒక్కొక్కరికి రూ.10,000 విలువైన గృహోపకరణాలను బహుమతిగా అందజేశారు. చివర్లో అందరికీ విందు కూడా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..