Expensive Tea: ఒక కప్పు టీ ధర రూ. లక్ష.. దీన్ని తాగాలంటే ఈఎంఐ తీసుకోవాల్సిందే?
- ఒక కప్పు టీకి రూ. 1.14 లక్షలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఒక కప్పు టీకి రూ. లక్ష ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అవును.. మీరు నమ్మకపోయినా.. ఇది నిజం. దుబాయ్లోని ఒక రెస్టారెంట్ మెనూలో లక్ష రూపాయల టీ కనిపిస్తుంది. ఈ ‘గోల్డ్ కడక్’ టీ ధర ఆకాశాన్నంటుతోంది. దుబాయ్లో భారతీయ సంతతికి చెందిన పారిశ్రామికవేత్త సుచేతా శర్మ రెస్టారెంట్లో ఈ ఖరీదైన చాయ్ని అమ్ముతున్నారు. ఈ బోహో కేఫ్ లో టీ ధర AED 5000 (సుమారు రూ. 1.14 లక్షలు). 24 క్యారెట్ల బంగారు పూత కలిపిన ఈ టీని స్వచ్ఛమైన వెండి కప్పులో అందిస్తారు. ఒక్కో సిప్ లో వేడివేడి చాయ్ తో పాటు బంగారాన్ని కూడా తాగేయొచ్చు. టీ తాగాక కప్పును అక్కడే వదిలేయకుండా ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చట.
READ MORE: Magical Stumping: నేపాల్ ప్రీమియర్ లీగ్లో అద్భుతమైన ఘటన.. మీరే చూసేయండి (వీడియో)
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్లు.. అవాక్కైన నెటిజన్లు
- Shloka Mehta: ఇంటర్నెట్ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్సిటీ.. వీడియో వైరల్
- Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
ఈ రెస్టారెంట్ బోహో కేఫ్ ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్ లో ఉంది. ఇక్కడ మెనులో భారతీయ ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. ప్రీమియం ఐటెమ్లలో గోల్డ్ సావనీర్ కాఫీ, గోల్డ్ డస్టెడ్ క్రోసెంట్స్, గోల్డ్ డ్రింక్స్, గోల్డ్ ఐస్ క్రీం కూడా ఉన్నాయి. ఈ ఖరీదైన పదార్థాల గురించి సుచేతా శర్మ మాట్లాడుతూ.. “మేము లగ్జరీని కోరుకునే వ్యక్తుల కోసం ఇలాంటి వాటిని తయారు చేస్తున్నాం. అంతే కాకుండా మేము గోల్డ్ సావనీర్ కాఫీ కూడా సర్వ్ చేస్తున్నాం. ఇది కూడా వెండి పాత్రలో అందిస్తాం. దీని ధర AED 4761 (సుమారు రూ. 1.09 లక్షలు). ఈ కప్లు కూడా మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. ” అని పేర్కొన్నారు.
READ MORE:TG Assembly: లగచర్ల రైతులకు బేడీల విషయంలో బీఆర్ఎస్ నిరసన.. అసెంబ్లీ రేపటికి వాయిదా
అయితే ఒక ఫుడ్ వ్లాగర్ బోహో కేఫ్ గురించిన వీడియోను అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రెస్టారెంట్లో ఏయే విషయాలు బాగా ఫేమస్, వాటి కోసం ఎంత ధర చెల్లించాల్సి వస్తుందో వివరించింది. అలాగే.. కేఫ్లో టీ, కాఫీ అందించే విధానం ఎంత ప్రత్యేకమైనదో ప్రస్తావించింది. అయితే.. దీనిపై ప్రజలు రకరకాలుగా స్పందించారు. ఈ టీతో ప్రయోజనం ఏమిటంటూ చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు. సామాన్యుడికి అత్యంత చేరువైనది టీ.. దానికి రూ.లక్షకు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. “గోల్డ్ కడక్ టీ తాగాలంటే ఈఎంఐ కట్టాల్సిందే” అని ఓ వ్యక్తి వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!