Bangladesh-India: షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు.. బంగ్లాదేశ్కు అప్పగించాలి.
- బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు
- షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు ఉంది- తౌహీద్ హుస్సేన్
- షేక్ హసీనా విషయంలో భారత్.. బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది హసీనా భారత్లోనే ఉంటే రెండు దేశాల మధ్య..
- ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉంది- మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్.
షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. షేక్ హసీనా ప్రస్తుతం ఇండియాలోని ఢిల్లీలో ఉందని. . హోం మంత్రిత్వ శాఖ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ నుండి ఏదైనా అభ్యర్థన వస్తే, షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు పంపమని తాము భారత ప్రభుత్వాన్ని కోరవలసి ఉంటుందని పేర్కొన్నారు.
Bandla Ganesh: ఆ రోజు పవన్ కళ్యాణ్ ప్రాణాలు పోయేవి!
Also Read
- Harish Rao: "వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి".. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
- AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
మరోవైపు.. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ, హసీనా భారత్లోనే ఉంటే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బీఎన్పీ (BNP) అధికారంలోకి వచ్చిన తర్వాత, అవామీ లీగ్ ప్రభుత్వం వివాదాస్పద అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సమీక్షిస్తుందన్నారు. దీని వల్ల బంగ్లాదేశ్ ప్రజలకు నష్టం జరుగుతోందని బీఎన్పీ జనరల్ సెక్రటరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్తో బలమైన సంబంధాల కోసం అలంగీర్ ఆకాంక్షించారు. గత విభేదాలను మరిచిపోయి సహకరించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్ భద్రతకు ముప్పు కలిగించే వాటిని అనుమతించబోమని ఆలంగీర్ స్పష్టం చేశారు. మైనారిటీల భద్రత బంగ్లాదేశ్ అంతర్గత విషయమని.. హిందువులపై దాడులు జరుగుతున్నాయనే వార్తలు తప్పని ఆయన తెలిపారు. షేక్ హసీనాను భారత్ ఒప్పించకపోతే ఇరుదేశాల మధ్య సంబంధాలు చెడిపోతాయని మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ అభిప్రాయపడ్డారు. “షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు తీసుకురావడానికి భారతదేశం ఏర్పాట్లు చేయాలి. ఇదే జరిగితే బంగ్లాదేశ్ ప్రజల మనోభావాలు గౌరవించబడతాయి’’ అని అలంగీర్ అన్నారు.
Russia: రష్యాలో ఘోర ప్రమాదం.. 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్
షేక్ హసీనాపై 2 కొత్త హత్య కేసులు నమోదయ్యాయి
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఇద్దరు బీఎన్పీ కార్యకర్తలతో సహా ముగ్గురు వ్యక్తులను చంపినందుకు సంబంధించి మాజీ ప్రధాని షేక్ హసీనాపై రెండు కొత్త హత్య కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఢాకా కోర్టులో ఈ కేసులు దాఖలయ్యాయి. కాగా.. బంగ్లాదేశ్ లో హింస చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేసి ఆగస్టు 5న దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. అప్పటి నుంచి షేక్ హసీనాపై హత్య కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్త కేసులతో షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 84కి చేరింది.
తాజావార్తలు
-
Today Gold and Silver Prices: బంగారం ధరల మంటలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
-
Harish Rao: “వడ్ల కేంద్రాల్లోకి వెళ్లి చూడండి”.. సీఎం రేవంత్రెడ్డికి హరీష్రావు లేఖ..
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో