Sheetal Devi: అద్భుతం సృష్టించిన భారత పారా ఆర్చర్.. పారా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుపు
- భారత్ గోల్డెన్ గర్ల్!
- పారా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో శీతల్ దేవికి స్వర్ణం
- ఒకే టోర్నీలో మూడు పతకాలు – కాంస్యం, రజతం, ఇప్పుడు బంగారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheetal Devi: ఆసియా పారా గేమ్స్ స్వర్ణ పతక విజేత, భారత పారా ఆర్చర్ శీతల్ దేవి శనివారం (సెప్టెంబర్ 27న) కొరియాలోని గ్వాంగ్జులో జరిగిన పారా ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మరో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఉత్కంఠగా సాగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో టర్కీ స్టార్ క్రీడాకారిణి ఓజ్నూర్ క్యూర్ గిర్డిపై 146-143 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. ఈ టోర్నమెంట్లో శీతల్కు ఇది మూడో పతకం కావడం విశేషం. ఇంతకుముందు ఆమె టోమన్ కుమార్తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గ్రేట్ బ్రిటన్ను ఓడించి కాంస్య పతకం గెలిచింది. కాంపౌండ్ మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్లో శీతల్, సరిత ద్వయం టర్కీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది.
50MP క్వాడ్ కెమెరా లెన్స్, 7000mAh బ్యాటరీ, OLED డిస్ప్లే, కూలింగ్ సిస్టమ్తో వచ్చేసిన Xiaomi 17
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
వ్యక్తిగత ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మొదటి రౌండ్లో ఇద్దరు క్రీడాకారిణులు 29-29తో సమంగా నిలిచారు. రెండో రౌండ్లో శీతల్ మూడు పర్ఫెక్ట్ 10లతో 30-27తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో రౌండ్ మళ్లీ 29-29తో టై అయింది. నాలుగో రౌండ్లో కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓడినా 116-114తో తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. చివరి రౌండ్లో శీతల్ మూడు బాణాలను సంధించి 30 పాయింట్లతో పర్ఫెక్ట్గా షూట్ చేసి పసిడిని గెలుచుకుంది. అంతకుముందు సెమీఫైనల్లో జమ్మూ కాశ్మీర్కు చెందిన ఈ ఆర్చర్ గ్రేట్ బ్రిటన్కు చెందిన జోడీ గ్రిన్హామ్పై 145-140తో విజయం సాధించింది. గతంలో, 2023 పిల్సెన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇదే గిర్డి చేతిలో శీతల్ 140-138తో ఓడిపోయింది. కానీ ఈసారి ఆమె విజయం సాధించి గత ఓటమికి బదులు తీర్చుకుంది.
కాంపౌండ్ మహిళల ఓపెన్ టీమ్ ఫైనల్లో శీతల్, సరిత ద్వయం ప్రారంభంలో మెరుగ్గానే రాణించారు. కానీ, టర్కీ టీమ్ చేతిలో 148-152 తేడాతో ఓడిపోయారు. మొదటి రౌండ్లో భారత ద్వయం 38-37తో ఆధిక్యంలోకి వచ్చింది. కానీ టర్కీ జట్టు రెండో రౌండ్లో పుంజుకుని స్కోరును 76-76తో సమం చేసింది. మూడో రౌండ్లో భారత జట్టు ఒత్తిడికి గురై 36 పాయింట్లు మాత్రమే సాధించగా, టర్కీ 37 పాయింట్లను సాధించింది. చివరి రౌండ్లో టర్కీ జట్టు దాదాపు పర్ఫెక్ట్గా 39 పాయింట్లు సాధించి స్వర్ణం గెలుచుకుంది. ఈ మ్యాచ్లో టీమ్ ఓడిపోయినప్పటికీ, శీతల్ దేవి వ్యక్తిగత ప్రదర్శనతో భారతదేశపు ఉత్తమ పారా ఆర్చర్లలో ఒకరని రుజువు చేసింది.
THE HISTORICAL MOMENTS FOLKS! 🔥🤩
India's First Ever Individual Para Archery World Champion – Sheetal Devi 🇮🇳🏆pic.twitter.com/5G58Wr4mGj
— The Khel India (@TheKhelIndia) September 27, 2025
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!