Eatala Rajendar: తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలా వద్దా?.. సీఎం వ్యాఖ్యలపై ఈటల కౌంటర్
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ ఈటల..
- కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీకు పంపిస్తా..
- కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలా వద్దా?: ఎంపీ ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eatala Rajendar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా కేబినెట్ లో ఆమోదం లేకుండా ఏమి జరగదు.. ఆయన మంత్రి వర్గంలో ఉన్నవారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారిని అడగవచ్చు అని సూచించారు. కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ అని నేను చెప్పాను, అది ఎప్పుడు మొదలయ్యిందో తెలుసుకోవాలి అని పేర్కొన్నారు. సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రొజెక్టులు రీ డిజైన్ లో కేసీఆర్ చేర్చారు.. అవినీతి జరిగితే విచారణ జరపండి, విచారణ జరిగిన చర్యలు తీసుకుంటారాని నమ్మకం లేదు, అందుకే సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు రాజకీయ పార్టీలకు ఏటిఎంలుగా మారాయని ఎంపీ ఈటల తెలిపారు.
Read Also: PM Modi: రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..
Also Read
అయితే, మొదట పిల్లర్లు రిపేర్ చేసి నీళ్లు ఇచ్చే పని పెట్టుకోండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు, వాటి పేరుతో అక్రమాలు చేయడం తప్పు అన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందా అని ప్రశ్నించారు. ప్రతి నిర్ణయం కేబినెట్ రాటిఫికేషన్ జరుగుతుంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాను అని చెప్పుకొచ్చారు. మీ డిపార్ట్మెంటో ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా.. కేబినెట్ లో పెట్టండి అని కేసీఆర్ చెప్పే వారు ఇది నిజం కాదంటే నేను దేనికైనా సిద్ధం అని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మించడం, అవినీతి వేరువేరుగా చూడాలి.. ప్రాజెక్ట్ నిర్మించాలి కానీ వాటిని అడ్డం పెట్టుకొని సంపాదించడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుందని బీజేపీ ఎంపీ ఈటల చెప్పారు.
Read Also: Malavika: ప్రభాస్ బాగా మాట్లాడతారు!
ఇక, తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగింది అని ఈటల రాజేందర్ తెలిపారు. నేను జైళ్లకు పోయిన, నా రక్తం చిందిది, పెట్రోల్ మంటల్లో యువత కాలిపోయింది, ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టాలా వద్దా? అని ప్రశ్నించారు. అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే మొదలు పెట్టారు కానీ పూర్తిచేయలేదు.. జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత- చేవెళ్ల ఐదేళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టేనా కదా?.. ఎందుకు పూర్తి చేయలేదన్నారు. కమీషన్ త్వరగా పూర్తి చేయాలి అవినీతి నిగ్గు తేల్చాలి.. బీజేపీ అయితే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది.. బీజేపీ ప్రాజెక్ట్స్ కట్టడానికి వ్యతిరేకం కాదు.. అధికారం అడ్డం పెట్టుకొని టెండర్లు లేకుండా పనులు పంచుకోవడం తప్పు అని ఎంపీ ఈటల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!