Eatala Rajendar: తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలా వద్దా?.. సీఎం వ్యాఖ్యలపై ఈటల కౌంటర్
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ ఈటల..
- కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ మీకు పంపిస్తా..
- కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలా వద్దా?: ఎంపీ ఈటల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eatala Rajendar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా కేబినెట్ లో ఆమోదం లేకుండా ఏమి జరగదు.. ఆయన మంత్రి వర్గంలో ఉన్నవారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారిని అడగవచ్చు అని సూచించారు. కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ అని నేను చెప్పాను, అది ఎప్పుడు మొదలయ్యిందో తెలుసుకోవాలి అని పేర్కొన్నారు. సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రొజెక్టులు రీ డిజైన్ లో కేసీఆర్ చేర్చారు.. అవినీతి జరిగితే విచారణ జరపండి, విచారణ జరిగిన చర్యలు తీసుకుంటారాని నమ్మకం లేదు, అందుకే సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు రాజకీయ పార్టీలకు ఏటిఎంలుగా మారాయని ఎంపీ ఈటల తెలిపారు.
Read Also: PM Modi: రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..
Also Read
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
అయితే, మొదట పిల్లర్లు రిపేర్ చేసి నీళ్లు ఇచ్చే పని పెట్టుకోండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు, వాటి పేరుతో అక్రమాలు చేయడం తప్పు అన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందా అని ప్రశ్నించారు. ప్రతి నిర్ణయం కేబినెట్ రాటిఫికేషన్ జరుగుతుంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని డాక్యుమెంట్స్ మీకు పంపిస్తాను అని చెప్పుకొచ్చారు. మీ డిపార్ట్మెంటో ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా.. కేబినెట్ లో పెట్టండి అని కేసీఆర్ చెప్పే వారు ఇది నిజం కాదంటే నేను దేనికైనా సిద్ధం అని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మించడం, అవినీతి వేరువేరుగా చూడాలి.. ప్రాజెక్ట్ నిర్మించాలి కానీ వాటిని అడ్డం పెట్టుకొని సంపాదించడాన్ని మా పార్టీ వ్యతిరేకిస్తుందని బీజేపీ ఎంపీ ఈటల చెప్పారు.
Read Also: Malavika: ప్రభాస్ బాగా మాట్లాడతారు!
ఇక, తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగింది అని ఈటల రాజేందర్ తెలిపారు. నేను జైళ్లకు పోయిన, నా రక్తం చిందిది, పెట్రోల్ మంటల్లో యువత కాలిపోయింది, ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్ట్ కట్టాలా వద్దా? అని ప్రశ్నించారు. అనేక ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే మొదలు పెట్టారు కానీ పూర్తిచేయలేదు.. జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత- చేవెళ్ల ఐదేళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టేనా కదా?.. ఎందుకు పూర్తి చేయలేదన్నారు. కమీషన్ త్వరగా పూర్తి చేయాలి అవినీతి నిగ్గు తేల్చాలి.. బీజేపీ అయితే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది.. బీజేపీ ప్రాజెక్ట్స్ కట్టడానికి వ్యతిరేకం కాదు.. అధికారం అడ్డం పెట్టుకొని టెండర్లు లేకుండా పనులు పంచుకోవడం తప్పు అని ఎంపీ ఈటల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..