Ganjai in Andhra University: ఏయూలో గంజాయి కలకలం.. నలుగురి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో గంజాయి గుప్పుమంటోంది. గంజాయి, మత్తుపదార్ధాలు యథేచ్ఛగా రవాణా అవుతున్నాయి. తాజాగా ఆంధ్రా యూనివర్శిటీలో గంజాయి దొరకడం కలకలం రేపుతోంది. ఆంధ్రావిశ్వవిద్యాలయంలో గంజాయి విక్రయిస్తున్నారు సెక్యూరిటీ గార్డులు. ఈనేపథ్యంలో సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఏయూ సెక్యూరిటీ ఆఫీసర్ కారు డ్రైవరే కీలక సూత్రధారిగా తేలింది. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నారు త్రీ టౌన్ పోలీసులు. చదువుల నిలయం ఏయూలో గతంలో గంజాయి వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. తాజాగా సెక్యూరిటీ గార్డులే గంజాయిని రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోవడం సంచలనంగా మారింది. అధికారులు ఇలాంటి చర్యల పట్ల అప్రమతంగా ఉండాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని విద్యార్ధులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
Read Also: CM KCR: ప్రతి డివిజన్లో ఆధునిక మార్కెట్లు.. కల్తీ బెడద లేకుండా చేస్తాం
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
మరోవైపు రెండురోజుల క్రితం కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు చల్లపల్లి పోలీసులు. బాపట్ల జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన మల్లవోలు ఆదిశేషు అతని భార్య వెంకటేశ్వరమ్మ, చల్లపల్లి కి చెందిన కోట అనిల్ కుమార్, చిలక అజయ్ అను నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 2.5 కేజీల గంజాయి, 3010 రూపాయల నగదు,3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
వీరు విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి గంజాయిని తీసుకువచ్చి చల్లపల్లి, రేపల్లె గ్రామాలలో ఉన్న యువతను గంజాయికి బానిసలుగా మారుస్తున్నట్లు అవనిగడ్డ డి.ఎస్.పి మహబూబ్ బాషా తెలిపారు. ఎన్జీవోల సహాయంతో యువతకు జిల్లా ఎస్పీ జాషువా ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇప్పించారు అధికారులు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనకాడమని అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరించారు. పిల్లల కదలికలపై, వారి మానసిక స్థితిపై ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు సూచించారు.
Read Also: Bhatti Vikramarka: ప్రధాని మోడీపై భట్టి కౌంటర్లు.. ప్రధానికి శాస్త్రీయ దృక్పధం లేదు
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!