Dowleshwaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
- ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం
- రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowleshwaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 13.70 అడుగులకు వరద నీటి మట్టం తగ్గింది. బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం నుండి విజ్జేశ్వరం వరకు బ్యారేజ్కు ఉన్న 175 గేట్లను ఎత్తివేశారు. ఎగువ ప్రాంతాల్లో నుండి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో. వరద ప్రవాహం తగ్గడంతో ఈ సాయంత్రానికి ధవలేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉంది. 11. 7 అడుగులకు నీటిమట్టం తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉంటుంది. గోదావరి వరదనీటి మట్టం తగ్గడంతో. బ్యారేజ్ దిగువన ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ఊపీరి పీల్చుకుంటున్నారు, కాజ్వేలపై నీటి ప్రవాహం తగ్గుతోంది.
Read Also: Crime News: పదో తరగతి చదువుతున్న బాలిక పై వృద్ధుడి అత్యాచారయత్నం
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
మరో వైపు అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఇళ్లకే పరిమితం అయ్యారు. రోడ్లు భారీగా కోతలకు గురవ్వడంతో ఊరు దాటి బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో నానా ఇబ్బందులు పడుతున్నారు ఏజెన్సీ వాసులు. ముంచంగి పుట్టు, జంగం పుట్టు, గుల్లేలుతో పాటు ఒడిశా సరిహద్దు గ్రామాలకు వరదల ప్రభావం పెరుగుతూనే ఉంది. వారాంతపు సంతలకు వెళ్లే అవకాశం లేక తినడానికి సరిపడా సరుకులు లేక అల్లాడిపోతున్నారు.. అధికారులూ కనీసం పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు.. ఏజెన్సీ వాసులు తప్పని పరిస్థితుల్లో ప్రమాదకర వాగులు, గెడ్డలు దాటుకుంటూ ప్రయాణిస్తున్నారు. వరద ఉదృతి భయంకరంగా ఉన్నా నిత్యావసర సరుకుల కోసం ప్రాణాలకు తెగించి మరీ గెడ్డలు దాటి మైదాన ప్రాంతాలకు చేరుకుంటున్నారు. బుంగా పుట్టు, లక్ష్మి పురం, ముంచంగి పుట్టు పరిధిలో సుమారు 70 గ్రామాలు చిక్కుకున్నాయి. జనజీవన స్రవంతి స్తంభించి పోవడంతో కొండ ప్రాంతాలలోనే మగ్గిపోయే పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!