DSC 2024: నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
- నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSC 2024: తెలంగాణలో డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సచివాలయంలో ఫలితాలను ప్రకటించిన ఆయన, దసరా పండుగకు ముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని వెల్లడించారు. సీఎం ప్రకటించిన ప్రకారం, టీచర్ల ఎంపిక ప్రక్రియలో విద్యాశాఖ యాక్టివ్గా పని చేస్తోంది. అక్టోబర్ 1(నేటి) నుంచి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న ఈ వెరిఫికేషన్ స్థానిక జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నిర్వహించబడుతుంది. పూర్తి సమాచారం కోసం విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా సూచించారు.
Read Also: Kolkata Rape Case: కోల్కతా హత్య కేసులో సీబీఐ, బెంగాల్ సర్కార్పై సీరియస్..
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం.. ఆయా జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి నేటి నుంచి ఈ నెల 5 వరకు సర్టెఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. జిల్లాలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని వెల్లడించారు. ఈ జాబితాలు డీఈవో వెబ్సైట్లలో ఉంటాయని పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, టెట్, డీఎస్సీ, కుల, 1-7 తరగతుల స్టడీ సర్టిఫికెట్ (ఒరిజినల్)లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తీసుకురావాలని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచిన ఫారాన్ని నింపి తెచ్చుకోవాలని తెలిపారు.
Read Also: Work pressure: పని ఒత్తిడికి మరొకరు బలి.. బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి ఆత్మహత్య
సీఎం రేవంత్ రెడ్డి, 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ ఫలితాలను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వంలో పదేళ్లలో కేవలం 7,000 పోస్టులే భర్తీ చేసినట్లు సీఎ వ్యాఖ్యానించారు, అయితే తమ ప్రభుత్వం కేవలం 10 నెలలలో 11,062 పోస్టులను భర్తీ చేస్తూ 56 రోజుల్లో ఫలితాలు విడుదల చేయగలిగింది. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 65,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో గ్రూప్-1 ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు గ్రామీణ విద్యను నిర్లక్ష్యం చేసినందున, తాము ఆ పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తున్నామని, విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందని చేసిన సాకులను ఖండించారు. గత ప్రభుత్వానికి చెందిన అన్ని అనుకూల పద్ధతులను తొలగిస్తామని, గ్రామీణ విద్యకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..