Kolkata Rape Case: కోల్కతా హత్య కేసులో సీబీఐ, బెంగాల్ సర్కార్పై సీరియస్..
- బెంగాల్ సర్కా్ర్ పై మండిపడిన సుప్రీంకోర్టు..
- ఆసుపత్రిలో సీసీటీవీలతో పాటు కనీస సదుపాలు ఏర్పాటు చేయాలని ఆదేశం..
- ట్రైనీ డాక్టర్ కేసులో సీబీఐపై కోల్కతా హైకోర్టు ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolkata Rape Case: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో వైద్యురాలిపై హత్య, ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణలో కీలకమైన ఆధారాలు బయటకు వచ్చాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బెంగాల్ సర్కార్ పై సీరియస్ అయింది. ఆసుపత్రిలో సీసీటీవీల ఏర్పాటు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాల దగ్గర ప్రత్యేక విశ్రాంతి గదుల నిర్మాణంలో ఆలస్యంపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడింది సుప్రీంకోర్టు. పనులు ఎందుకు ఆలస్యంగా కొనసాగుతున్నాయి.. మేం ఆగస్టు 9 నుంచి పర్యవేక్షిస్తున్నాం.. జరుగుతున్న పనిని అక్టోబర్ 15 లోపు పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ భద్రతలో లోపం.. కాన్వాయ్ పక్కనే కర్ర పట్టుకుని బైక్పై వెళ్లిన వ్యక్తి
Also Read
అలాగే, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవకతవకల కేసు కోల్కతా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తీరుపై ఈరోజు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసు ఇన్స్పెక్టర్ అభిజిత్ మోండల్, ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ల దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించేందుకు మరింత కస్టడీని కస్టడీని పొడిగించాలని కోరింది. అలాగే, తాలా పోలీస్ స్టేషన్ నుంచి సీసీటీవీ ఫుటేజీతో సహా డీవీఆర్లు, హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన డేటాలో కీలకమైన వాస్తవాలను వెలికితీసినట్లు సీబీఐ పేర్కొనింది.
Read Also: Work pressure: పని ఒత్తిడికి మరొకరు బలి.. బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి ఆత్మహత్య
ఇక, అభిజిత్ మోండల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. రోజుల తరబడి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను సేకరించలేదని పేర్కొన్నారు. సీబీఐ వద్ద డేటా ఉంటే మళ్లీ కస్టడీ ఎందుకు అని అడిగారు. అలాగే, సందీప్ ఘోష్ తరపు న్యాయవాది వాదిస్తూ.. నా క్లైంట్ ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్.. తాలా పోలీస్ స్టేషన్కి కాదు అన్నారు. సందీప్ ఘోష్ బెయిల్ను జాప్యం చేసేందుకే సీబీఐ కస్టడీని కోరుతుందని డిఫెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఐ కస్టడీలో ఐదు రోజులు ఉన్నప్పటికీ.. వారు ఒక్కసారి కూడా నా క్లయింట్ను ప్రశ్నించలేదని సందీప్ ఘోష్ లాయర్ పేర్కొన్నారు. దీంతో సందీప్ ఘోష్, అభిజిత్ మండల్ కస్టడీని పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం.. నిందితులిద్దరినీ మరో నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!