Kolkata Rape Case: కోల్కతా హత్య కేసులో సీబీఐ, బెంగాల్ సర్కార్పై సీరియస్..
- బెంగాల్ సర్కా్ర్ పై మండిపడిన సుప్రీంకోర్టు..
- ఆసుపత్రిలో సీసీటీవీలతో పాటు కనీస సదుపాలు ఏర్పాటు చేయాలని ఆదేశం..
- ట్రైనీ డాక్టర్ కేసులో సీబీఐపై కోల్కతా హైకోర్టు ఆగ్రహం..
Kolkata Rape Case: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో వైద్యురాలిపై హత్య, ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణలో కీలకమైన ఆధారాలు బయటకు వచ్చాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బెంగాల్ సర్కార్ పై సీరియస్ అయింది. ఆసుపత్రిలో సీసీటీవీల ఏర్పాటు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాల దగ్గర ప్రత్యేక విశ్రాంతి గదుల నిర్మాణంలో ఆలస్యంపై మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడింది సుప్రీంకోర్టు. పనులు ఎందుకు ఆలస్యంగా కొనసాగుతున్నాయి.. మేం ఆగస్టు 9 నుంచి పర్యవేక్షిస్తున్నాం.. జరుగుతున్న పనిని అక్టోబర్ 15 లోపు పూర్తి చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ భద్రతలో లోపం.. కాన్వాయ్ పక్కనే కర్ర పట్టుకుని బైక్పై వెళ్లిన వ్యక్తి
Also Read
అలాగే, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అవకతవకల కేసు కోల్కతా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తీరుపై ఈరోజు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో పోలీసు ఇన్స్పెక్టర్ అభిజిత్ మోండల్, ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ల దగ్గర నుంచి మరింత సమాచారం సేకరించేందుకు మరింత కస్టడీని కస్టడీని పొడిగించాలని కోరింది. అలాగే, తాలా పోలీస్ స్టేషన్ నుంచి సీసీటీవీ ఫుటేజీతో సహా డీవీఆర్లు, హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన డేటాలో కీలకమైన వాస్తవాలను వెలికితీసినట్లు సీబీఐ పేర్కొనింది.
Read Also: Work pressure: పని ఒత్తిడికి మరొకరు బలి.. బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి ఆత్మహత్య
ఇక, అభిజిత్ మోండల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. రోజుల తరబడి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నా.. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలను సేకరించలేదని పేర్కొన్నారు. సీబీఐ వద్ద డేటా ఉంటే మళ్లీ కస్టడీ ఎందుకు అని అడిగారు. అలాగే, సందీప్ ఘోష్ తరపు న్యాయవాది వాదిస్తూ.. నా క్లైంట్ ఆర్జీ కర్ ఆసుపత్రి ప్రిన్సిపాల్.. తాలా పోలీస్ స్టేషన్కి కాదు అన్నారు. సందీప్ ఘోష్ బెయిల్ను జాప్యం చేసేందుకే సీబీఐ కస్టడీని కోరుతుందని డిఫెన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఐ కస్టడీలో ఐదు రోజులు ఉన్నప్పటికీ.. వారు ఒక్కసారి కూడా నా క్లయింట్ను ప్రశ్నించలేదని సందీప్ ఘోష్ లాయర్ పేర్కొన్నారు. దీంతో సందీప్ ఘోష్, అభిజిత్ మండల్ కస్టడీని పొడిగించాలన్న సీబీఐ అభ్యర్థనను తిరస్కరించిన న్యాయస్థానం.. నిందితులిద్దరినీ మరో నాలుగు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Kitchen Tips: మీ పెనం నల్లబడిందా..? ఏళ్ల మసి నిమిషాల్లో మాయం.. కొత్తదానిలా మెరిపించే సూపర్ చిట్కాలు..!
-
E Challan: ట్రాఫిక్ ఈ చలాన్లపై.. కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు..
-
Chegg Downfall: ఒకప్పుడు ఎడ్టెక్ రారాజు.. నేడు దివాళా దిశగా! ఏఐ దెబ్బకు 15 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం క్లోజ్
-
Electric Scooters: హీరో, టీవీఎస్, లేదా ఏథర్.. దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?
-
IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!