Uttar Pradesh: రెండేళ్లుగా అత్యాచారం.. బిడ్డను చంపేస్తేనే పెళ్లి చేసుకుంటానన్న నీచుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఓ యువకుడు పెళ్లి సాకుతో యువతిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ఆమె గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకోమని యువతి యువకుడిని బలవంతం చేయగా.. ఈ చిన్నారిని చంపేస్తే చేసుకుంటా.. ఇలా చేయకుంటే నేను పెళ్లి చేసుకోను. దీంతో పాటు నీ అశ్లీల వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగాడు.
యువకుడి బెదిరింపుపై భయపడిన యువతి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. కాని పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ యువకుడు తనను చంపేస్తానని పదే పదే బెదిరిస్తున్నాడని యువతి ఆరోపించింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె ఎస్ఎస్పీ కార్యాలయానికి చేరుకుని యువకుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్పీ ఆదేశించారు.
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
Read Also:Tomato: నా టమాటాలు పోయాయి సార్.. పూణెలో పోలీస్ స్టేషన్లో మొదటి కంప్లైంట్
కాంట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న యువతి తన వ్యక్తిగత పని కోసం నారియావాల్కు వెళ్లేది. నరియావాల్లోనే ప్రదీప్ను కలిసింది. క్రమంగా ప్రదీప్తో స్నేహం ఏర్పడి ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పెళ్లి సాకుతో రెండేళ్లుగా ప్రదీప్ ఆమెతో సంబంధాలు కొనసాగించాడు. పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు ప్రదీప్ కొన్ని రోజులు ఆగండి, తర్వాత కోర్ట్ మ్యారేజ్ చేసుకుంటామని నమ్మించినట్లు అమ్మాయి తెలిపింది.
ఇంతలోనే తాను గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె తెలిపింది. బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రదీప్ పెళ్లికి నిరాకరించాడు. బిడ్డను చంపేయండి, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఆమె నిరాకరించడంతో ప్రదీప్ చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు తన అసభ్యకర వీడియోలు, ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు.
Read Also:Kishan Reddy: నేడే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు.. పాల్గొననున్న ముఖ్యనేతలు
ప్రదీప్ చర్యతో కలత చెందిన తాను బిత్రి పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్య తీసుకోలేదని యువతి తెలిపింది. దీంతో ఆందోళనకు గురైన ఆమె గురువారం ఎస్ఎస్పీ కార్యాలయానికి చేరుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరింది. యువతి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరి బిత్రి పోలీసు స్టేషన్ను ఆదేశించారు.
తాజావార్తలు
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.