Crime News : ఐశ్వర్య అనే యువతి మిస్సింగ్.. చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహం లభ్యం
- చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో యువతి మృతదేహం
- అత్యాచారం చేసి అంతమొందించినట్లుగా ఆనవాళ్లు
Crime News : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్కి చెందిన ఐశ్వర్య (17) అదృశ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదో తారీకు తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు ఉప్పుగూడ కు చెందిన యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఉందని విచారణలో తేలింది. దీంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అమ్మాయిని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాలలో చంపేసినట్లు గుర్తించారు. అయితే మియాపూర్ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే అమ్మాయి బతికి ఉండేదని పలువురు అంటున్నారు. యువతి అదృశ్యమైన విషయం పోలీసులు గోపంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం.
Kollywood : సూర్య కోసం వెనక్కు తగ్గిన కుట్టి మక్కల్ సేతుపతి
Also Read
- Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- US-Iran War: "ట్రంప్పై నమ్మకం లేదు".. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
NTVతో యువతి బంధువులు, బస్తీవాసులు మాట్లాడుతూ.. ఈ నెల 8న మైనర్ అమ్మాయి మిస్సింగ్ అయిందని, యువతి చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహాం డీకంపోజ్ స్థితిలో లభ్యం అయిందన్నారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పలు అనుమానాలు ఉన్నాయని, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో (17) మైనర్ గర్ల్ అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ నెల 10వ తేదీన పోలీసులు ఎఫైర్ నమోదు చేసి దర్యాప్తు చేశారని, ఉప్పుగూడ కు చెందిన విగ్నేష్ అనే యువకుడితో యువతికి ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయిందని, విగ్నేష్ అనే యువకుడు మైనర్ అమ్మాయి (17) వీరు ఇద్దరు వివాహం చేసుకున్నారని వారు తెలిపారు. 10 రోజులు వీరు బయట ఉన్నారని, మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు లొకేషన్ ట్రెజ్ చేశారని, విగ్నేష్ ఇతనికి సహకరించిన సాకేత్ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారని, నిందితులు యువతి మృతదేహం తుక్కుగూడలో చంపి పడేసిన స్పాట్ చూపించారని తెలిపారు. దీంతో.. పోలీసులు దర్యాప్తు చేసి
మైనర్ అమ్మాయి వేరే వాడితో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతోందనే కోపంతో హత్య చేశానని నిందితుడు విగ్నేష్ ఒప్పుకున్నాడని పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Double Murder: దారుణ ఘటన.. అక్క, 3 నెలల చిన్నారిని హత్య చేసిన తమ్ముడు
తాజావార్తలు
-
Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!