Crime News : ఐశ్వర్య అనే యువతి మిస్సింగ్.. చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహం లభ్యం
- చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో యువతి మృతదేహం
- అత్యాచారం చేసి అంతమొందించినట్లుగా ఆనవాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేక్ అంజయ్య నగర్కి చెందిన ఐశ్వర్య (17) అదృశ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎనిమిదో తారీకు తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు ఉప్పుగూడ కు చెందిన యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఉందని విచారణలో తేలింది. దీంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు అమ్మాయిని తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతాలలో చంపేసినట్లు గుర్తించారు. అయితే మియాపూర్ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే అమ్మాయి బతికి ఉండేదని పలువురు అంటున్నారు. యువతి అదృశ్యమైన విషయం పోలీసులు గోపంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చినట్లు సమాచారం.
Kollywood : సూర్య కోసం వెనక్కు తగ్గిన కుట్టి మక్కల్ సేతుపతి
Also Read
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
NTVతో యువతి బంధువులు, బస్తీవాసులు మాట్లాడుతూ.. ఈ నెల 8న మైనర్ అమ్మాయి మిస్సింగ్ అయిందని, యువతి చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహాం డీకంపోజ్ స్థితిలో లభ్యం అయిందన్నారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పలు అనుమానాలు ఉన్నాయని, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో (17) మైనర్ గర్ల్ అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ నెల 10వ తేదీన పోలీసులు ఎఫైర్ నమోదు చేసి దర్యాప్తు చేశారని, ఉప్పుగూడ కు చెందిన విగ్నేష్ అనే యువకుడితో యువతికి ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయిందని, విగ్నేష్ అనే యువకుడు మైనర్ అమ్మాయి (17) వీరు ఇద్దరు వివాహం చేసుకున్నారని వారు తెలిపారు. 10 రోజులు వీరు బయట ఉన్నారని, మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు లొకేషన్ ట్రెజ్ చేశారని, విగ్నేష్ ఇతనికి సహకరించిన సాకేత్ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారని, నిందితులు యువతి మృతదేహం తుక్కుగూడలో చంపి పడేసిన స్పాట్ చూపించారని తెలిపారు. దీంతో.. పోలీసులు దర్యాప్తు చేసి
మైనర్ అమ్మాయి వేరే వాడితో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడుతోందనే కోపంతో హత్య చేశానని నిందితుడు విగ్నేష్ ఒప్పుకున్నాడని పోలీసుల విచారణలో తేలిందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Double Murder: దారుణ ఘటన.. అక్క, 3 నెలల చిన్నారిని హత్య చేసిన తమ్ముడు
తాజావార్తలు
-
Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
-
AP Women’s Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?