SBI:తలసరి ఆదాయంపై ఎస్బీఐ కీలక రిపోర్ట్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ 2047 నాటికి అంటే 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 లక్ష్యాలు చేరుకోవాలంటే వచ్చే ఐదేళ్లూ చాలా కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉందని అభివృద్ధి చెందిన దేశంగా మారడం అనేది కలగా మిగిలిపోరాదని మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో చెప్పారు. ఇదిలా వుండగా తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్ చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తోంది. 2047 నాటికి దేశ తలసరి ఆదాయం గణనీయంగా పెరగనున్నట్లు ఆ రిపోర్ట్ లో పేర్కొంది.
ప్రస్తుతం 2022- 23 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 2 లక్షలుగా ఉంది. ఇక అది 2047 నాటికి రూ. 14.9 లక్షలకు పెరగనున్నట్లు ఎస్బీఐ తన రిపోర్టులో పేర్కొంది. అంటే దాదాపు ఏడున్నర రెట్లు తలసరి ఆదాయం పెరిగినట్లు లెక్క. అంటే ఇంకా కేవలం 23యేళ్లలోనే భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి అభివృద్ధి చెందిన దేశంగా అమెరికా వంటి దేశాల సరసన చేరనుంది.
Also Read
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
Also Read:RBI: ఆర్బీఐ కొత్త ప్లాట్ఫామ్.. ఇక లోన్ పొందడం చాలా ఈజీ
కేవలం ఈ గణాంకాలు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చి నివేదిక వెల్లడించింది.2047 నాటికి ట్యాక్స్ చెల్లింపుదారుల సగటు ఆదాయం రూ. 49.9 లక్షలకు పెరగనుందని తెలిపింది. ప్రస్తుతం 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో వీరి ఆదాయం రూ.13 లక్షలుగా ఉంది. ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య 48. 2 కోట్లకు పెరగనుందని స్టేట్ బ్యాంక్ రీసెర్ఛ్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం దేశంలో ట్యాక్స్ చెల్లింపులు చేస్తున్న వారి సంఖ్య 8. 5 కోట్లగా ఉంది.
జీరో ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య 25 శాతం మేర తగ్గనుందని అంచనా వేసింది. దీనిని బట్టి చూస్తే దేశంలో ఆదాయం పెరిగి ఎక్కువ మంది ట్యాక్స్ చెల్లించే పరిధిలోకి వస్తే అంటే ప్రజల జీవన ప్రమాణాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. అంటే మోడీ చెప్పినట్లుగానే వందో స్వాతంత్ర్య దినోత్సవం నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడం, భారతీయుల చిరకాల వాంఛ నేరవేరడం పక్కాగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Ajay Bhupathi: “శ్రీనివాస మంగాపురం” ఆడియో బ్లాక్బస్టర్ హిట్ కాబోతోంది: డైరెక్టర్ అజయ్ భూపతి
-
BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
-
NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..