State Bank Of India: ఎస్బీఐ యూజర్లకు అలర్ట్.. రూ.10వేలకు మించి ఏటీఎంలో విత్డ్రా చేస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI changed Rule For ATM Cash Withdrawal: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోసపూరిత లావాదేవీల నుంచి కస్టమర్లకు రక్షణ కలిగించేందుకు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత నగదు విత్డ్రా సేవలను ప్రారంభించింది. ఈ సేవల ప్రకారం ఎస్బీఐ ఖాతాదారుడు రూ.10వేలకు మంచి ఏటీఎంలో నగదు విత్డ్రా చేయాలంటే మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూ.10వేల వరకు ఓటీపీ అవసరం లేకుండా నగదు విత్డ్రా చేసుకోవచ్చని.. రూ.10వేలకు మంచి నగదు విత్డ్రా చేయాలంటే మాత్రమే ఓటీపీ ఎంటర్ చేయాలని ఎస్బీఐ అధికారులు వెల్లడించారు.
Read Also: 5G Spectrum: 5జీ స్పెక్ట్రం వేలానికి వేళాయె. మరికొద్దిసేపట్లోనే ప్రారంభం.
Also Read
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
అంటే రూ.10వేల కంటే మించి నగదును ఏటీఎంలో విత్డ్రా చేయాలంటే ఖాతాదారులు తప్పనిసరిగా మొబైల్ను ఏటీఎం సెంటర్కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు పెట్టి పిన్ నంబర్ ఎంటర్ చేయగానే ఖాతాతో అనుసంధానం చేసుకున్న మొబైల్ నంబర్కు నాలుగు అంకెల ఓటీపీ వస్తుంది. దానిని ఏటీఎంలో ఎంటర్ చేస్తేనే డబ్బులు డ్రా చేసుకునే వీలుంటుంది. ఈ ఓటీపీ ఒక లావాదేవీకి మాత్రమే పరిమితం. కాగా త్వరలో చాలా బ్యాంకులు ఎస్బీఐ బాటలోనే ఏటీఎంల నుంచి నగదు విత్డ్రా చేయడంపై ఈ పద్ధతిని అమలు చేయనున్నాయి. అటు సోషల్ మీడియా, ఇతర ప్లాట్ఫారమ్ల ద్వారా SBI ఎప్పటికప్పుడు ఏటీఎంలలో జరిగే మోసాలపై కస్టమర్లకు అవగాహన కల్పిస్తోంది. తాము సూచించిన విధంగా ఎస్బీఐ సేవలను పొందాలని విజ్ఞప్తి చేస్తోంది.
తాజావార్తలు
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!