Chawl Land Scam Case: సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీ సెప్టెంబర్ 19 వరకు పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chawl Land Scam Case: పత్రాచల్ భూ కుంభకోణానికి సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు సెప్టెంబరు 19 వరకు పొడిగిస్తూ ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఎ) కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గోరేగావ్ సబర్బన్లోని పత్రాచల్ను పునరాభివృద్ధి చేయడంలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆగస్టు 1న అరెస్టు చేసింది. మొదట్లో ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత శివసేన నాయకుడిని ఆగస్టు 8న 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆగస్ట్ 22న కోర్టు రౌత్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది, ఇప్పుడు దానిని సెప్టెంబర్ 19 వరకు పొడిగించారు.
ఈ కేసులో విచారణ ఇంకా పూర్తికానందున ఆయన జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఇటీవల కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దరఖాస్తు చేసుకుంది. మరోవైపు సంజయ్ రౌత్ బెయిల్ కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే ఈడీ అభ్యర్థనను అంగీకరించిన న్యాయస్థానం.. ఆయన కస్టడీని పొడగించింది. కాగా.. కస్టడీ సమయంలో సంజయ్ రౌత్ పార్లమెంట్ పత్రాలపై సంతకాలు చేసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే ఆ పత్రాల కాపీలను ఈడీ, కోర్టుకు సమర్పించాలని సూచించింది.
Also Read
- Kaviya Maran: సన్రైజర్స్ ఓనరమ్మతో అనిరుధ్ పెళ్లి పక్కా.. బంధువుల ఇంటర్వ్యూతో లీకైన పెళ్లి ముచ్చట..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
ఈడీ అధికారులు జూలై 31న శివసేన నాయకుడి ఇంటిపై దాడి చేసి, కొన్ని గంటలపాటు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన తర్వాత ఆగస్టు 1న అరెస్టు చేశారు. ఈ ఏడాది జూన్ 28న రూ. 1,034 కోట్ల పత్రాచల్ భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంజయ్ రౌత్కు సమన్లు జారీ చేసింది. తిరిగి ఆగస్టులో ఈ కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ భార్యకు కూడా ఈడీ సమన్లు జారీచేసింది. ఈడీ అధికారులు శివసేన నాయకుడి ఇంటిపై దాడి చేసి సంజయ్ రౌత్ను చాలా గంటలపాటు నిర్బంధించి, ప్రశ్నించిన అనంతరం ఆయనను అరెస్టు చేసిన తర్వాత భార్య వర్షా రౌత్ను ఈడీ విచారించింది. రౌత్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడు.
Supreme Court: ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని నిలిపివేయాలంటూ పిటిషన్.. విచారణకు సుప్రీం నిరాకరణ
ఇదిలా ఉండగా, శివసేన ఎంపీకి సన్నిహితుడిగా భావిస్తున్న సుజిత్ పాట్కర్ భార్య స్వప్న పాట్కర్ను బెదిరించినందుకు సంజయ్ రౌత్పై ముంబైలో మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ శిక్షాస్మృతిలోని 504,506, 509 సెక్షన్ల కింద వకోలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్వప్నా పాట్కర్ను రౌత్ బెదిరిస్తున్నట్లు వినిపించిన ఆడియో క్లిప్ వైరల్ అయింది. ఈ కేసులో స్వప్నా పాట్కర్ సాక్షిగా ఉన్నారు.
తాజావార్తలు
-
Kaviya Maran: సన్రైజర్స్ ఓనరమ్మతో అనిరుధ్ పెళ్లి పక్కా.. బంధువుల ఇంటర్వ్యూతో లీకైన పెళ్లి ముచ్చట..
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!